Hyderabad: రెండో దశలో 415 పంచాయతీలు ఏకగ్రీవం

Hyderabad: రెండో దశ పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 415 గ్రామాలు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు సమాచారం. అలాగే 8,304 వార్డుల్లో కూడా పోటీ లేకుండానే అభ్యర్థులు విజయం సాధించారు. రెండో విడతలో మొత్తం 3,911 గ్రామాల పంచాయితీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ దశలో అత్యధికంగా కామారెడ్డి జిల్లా ముందంజలో నిలిచింది, మొత్తం 44 గ్రామాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. నల్గొండ మరియు నిజామాబాద్ జిల్లాల్లో చెరో 38 గ్రామాలు ఏకగ్రీవం కాగా, ఆసిఫాబాద్ జిల్లాలో మాత్రం కేవలం ఒక్క గ్రామమే ఏకగ్రీవం కావడం గమనార్హం.

 

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *