Hyderabad: 39 రైళ్లు రద్దు… సికింద్రాబాద్ లో లొల్లి చేస్తున్న జనం

Hyderabad: దక్షిణ మధ్య రైల్వే 39 రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.మరో 53 రైళ్లను దారి మళ్లించి, 7 రైళ్లను రీ షెడ్యూల్ చేసింది. పెద్దపల్లి – రాఘవాపూర్ మధ్య గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో తిరుపతి – జమ్మూ ఎక్స్ ప్రెస్ సైతం రద్దవ్వడంతో.. సికింద్రాబాద్ లో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. తిరుపతి – జమ్మూ రైలు కోసం సుమారు 200 మంది ప్రయాణికులు ఎదురుచూస్తుండగా.. అధికారులు అప్పటికప్పుడు రైలును రద్దు చేసినట్లు ప్రకటించారు.

దీంతో తమకు ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు తమను వేరే మార్గాల్లో వెళ్లాలని చెప్తే ఎటు వెళ్లాలని వాపోతున్నారు. ప్రభుత్వం లేదా రైల్వే అధికారులే ప్రత్యామ్నాయం చూపాలని ఆందోళనకు దిగారు.కాగా.. పట్టాలు తప్పిన గూడ్సురైలుకు మరమ్మతులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. మరింత సమయం పడుతుందని అధికారులు తెలిపారు. ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు మరో 15 గంటల సమయం పడుతుందని చెప్పారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Delhi: ఈషా ఫౌండేషన్ కు ఊరట.. కేసు కొట్టేసిన సుప్రీం కోర్టు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *