సోమవారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ నాణేన్ని విడుదల చేయనున్నారు. ఉదయం 10.30 గంటల నుంచి రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో జరిగే కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, నందమూరి కుటుంబసభ్యులు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి దాదాపు 200 మంది దాకా అతిథులు పాల్గొననున్నట్లు సమాచారం.
