Vijay Deverakonda: టాలీవుడ్లో స్టార్ హీరో విజయ్ దేవరకొండ మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. కొత్త సినిమా ‘రౌడీ జనార్ధన్’ శనివారం ఉదయం హైదరాబాద్లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ‘రాజావారు రాణిగారు’ సినిమాతో దర్శకుడిగా గుర్తింపు పొందిన రవికిరణ్ కోల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ భారీ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై నిర్మిస్తున్నారు. కార్యక్రమానికి నిర్మాత అలు అరవింద్ హాజరై తొలి సన్నివేశానికి క్లాప్ ఇచ్చారు. విజయ్ సరసన జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తున్నారు. విజయ్, కీర్తి కాంబినేషన్లో ఇది మొదటిసారి పూర్తి స్థాయి జంటగా వస్తున్న సినిమా. గతంలో ఇద్దరూ ‘మహానటి’లో కలిసి నటించినా, ఆ చిత్రంలో వీరిద్దరికి పెద్దగా సీన్స్ లేకపోయాయి. ఈసారి మాత్రం యాక్షన్, ఎమోషన్ల మేళవింపుతో పెద్ద స్థాయిలో తెరకెక్కించనున్నారు.
Also Read: Narne Nithiin Marriage: బామ్మర్ది పెళ్లి లో ఎన్టీఆర్ సందడి..
దర్శకుడు రవికిరణ్, విజయ్ పాత్ర మాస్ యాక్షన్ బ్యాక్డ్రాప్లో ఉంటుంది. కథలో పంచ్ డైలాగ్స్, స్టైల్ యాక్షన్ సీన్స్ ప్రధాన ఆకర్షణలుగా ఉండబోతున్నాయి. సినిమా షూటింగ్ ఈ నెల 16న ముంబైలో ప్రారంభమవుతుంది. ఇటీవలే ‘కింగ్డమ్’ సినిమాతో ప్రేక్షకులను అలరించిన విజయ్ దేవరకొండ, ఈసారి మరింత యాక్షన్ టచ్తో అభిమానులను ఆకట్టుకోనున్నాడు. ఈ మూవీలో సీనియర్ నటుడు రాజశేఖర్ విలన్గా కనిపించనున్నారనే వార్త ఫిలింనగర్లో హాట్ టాపిక్గా మారింది.
A Wild Beginning.. 🔥
LOVE – RAGE – BLOOD ❤️🔥The most anticipated @TheDeverakonda x @storytellerkola‘s #SVC59 has began today with an auspicious Pooja Ceremony.#VDKolaMassThaandavam Begins.. 💥@KeerthyOfficial #AnendCChandran@DinoShankar @PraveenRaja_Off @SVC_official pic.twitter.com/LkTb6lsliK
— Sri Venkateswara Creations (@SVC_official) October 11, 2025
పూజా కార్యక్రమాల్లో కీర్తి సురేష్ పట్టు చీరలో మెరిసిపోయారు. ఆమె లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది ఆమె పెళ్లి తర్వాత చేస్తున్న మొదటి పెద్ద సినిమా కావడం విశేషం. నిర్మాతలు వచ్చే ఏడాది ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. సినిమా నుంచి త్వరలో ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నట్లు సమాచారం.