Kakinada Child Missing: కాకినాడ జిల్లాలో రెండేళ్ల జ్ఞానేశ్వరి అదృశ్యం కేసు మిస్టరీగా మారింది. తోటలోకి వెళ్లిన పాప కోసం 400 మంది సిబ్బంది, థర్మల్ డ్రోన్లతో 500 ఎకరాల్లో గాలిస్తున్నారు. పాపతో పాటు ఉండి, తిరిగి వచ్చిన పెంపుడు కుక్క కూడా అనుకోకుండా మృతి చెందడం కేసును సందిగ్ధంలో పడేసింది. కుటుంబ కలహాల కోణంలో తండ్రిని విచారిస్తున్న పోలీసులు, జంతువుల దాడి అనుమానంతో స్పై కెమెరాల బొమ్మలను కూడా ఏర్పాటు చేశారు.
మరింత Kakinada Child Missing: 500 ఎకరాలు.. థర్మల్ డ్రోన్లు.. 400 మంది సిబ్బంది! తండ్రి విచారణ.. క్లూ ఇస్తుందనుకున్న పెంపుడు కుక్క మృతి!Tag: Andhra Pradesh News
ED Arrest: వైసీపీ మాజీ మంత్రి కారుమూరి కుమారుడు సునీల్ను అరెస్ట్ చేసిన ఈడీ!
ED Arrest: ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ హయాంలో జరిగినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మద్యం రవాణా కుంభకోణం (AP Liquor Transport Scant) కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ (ED) కీలక చర్య తీసుకుంది.
మరింత ED Arrest: వైసీపీ మాజీ మంత్రి కారుమూరి కుమారుడు సునీల్ను అరెస్ట్ చేసిన ఈడీ!Sai Krishna: కృష్ణలంక సీఐ నాగరాజు సస్పెన్షన్.. రంగంలోకి ఐపీఎస్ అధికారి!
Sai Krishna: విజయవాడకు చెందిన సాయికృష్ణ మిస్సింగ్ కేసును ఏపీ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జరిపిన సమీక్ష అనంతరం కృష్ణలంక సీఐ నాగరాజును సస్పెండ్ చేశారు. పోలీసులే తన కొడుకును చంపేశారని సాయికృష్ణ తల్లి ఆరోపిస్తూ, పీఎస్ సీసీ ఫుటేజ్ భద్రపరచాలని కోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం ఈ కేసు విచారణను ఐపీఎస్ అధికారి, రాజమండ్రి ఎస్పీ నరసింహ కిషోర్కు అప్పగించింది.
మరింత Sai Krishna: కృష్ణలంక సీఐ నాగరాజు సస్పెన్షన్.. రంగంలోకి ఐపీఎస్ అధికారి!Pawan Kalyan: అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన పవన్ కళ్యాణ్
Pawan Kalyan: అరుదైన ‘డ్యూచెన్ మస్кулярర్ డిస్ట్రోఫీ’ వ్యాధితో బాధపడుతున్న 17 ఏళ్ల అభిమాని నిరంజన్ను పరామర్శించడానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హన్మకొండలోని ఆయన నివాసానికి స్వయంగా వచ్చి 40 నిమిషాలు గడిపారు. బాబు వైద్య ఖర్చులకు రూ. లక్ష ఆర్థిక సాయం అందించడంతో పాటు శ్రీవారి శేషవస్త్రంతో ఆశీర్వదించారు. ఆ కుటుంబం కోసం క్యాంటీన్ ఏర్పాటు చేయాలని జనసేన నేతలను ఆదేశించిన పవన్, అనంతరం భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు.
మరింత Pawan Kalyan: అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన పవన్ కళ్యాణ్Pawan Kalyan: ఢిల్లీలో పవన్ కళ్యాణ్ ‘సూపర్ హిట్’ టూర్.. ఏపీ అటవీ ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..!
Pawan Kalyan: ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్తో భేటీ అయి 7 కీలక ప్రతిపాదనలకు ఆమోదం సాధించారు. ఏనుగుల దాడి నివారణకు ‘హనుమాన్ సెంటర్’, టైగర్ రిజర్వ్ రక్షణకు 150 బేస్ క్యాంప్లు, 300 మంది చెంచు యువతకు ఉద్యోగాలు, ఎంపీ మరియు మహారాష్ట్రల నుండి 50 బోదెద్దులు, 6 పులుల తరలింపునకు అనుమతులు లభించాయి. అలాగే కేంద్రమంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, సీఆర్ పాటిల్లను కలిసి ఉపాధి హామీ నిధులు, గోదావరి ప్రక్షాళన, సూరత్ నీటి నిర్వహణ నమూనా అమలుపై చర్చించారు.
మరింత Pawan Kalyan: ఢిల్లీలో పవన్ కళ్యాణ్ ‘సూపర్ హిట్’ టూర్.. ఏపీ అటవీ ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..!Chandrababu: సింగపూర్ సమ్మిట్లో సీఎం చంద్రబాబు నాయుడు ‘ఏఐ & అమరావతి’ రోడ్మ్యాప్..!
Chandrababu: సింగపూర్ ‘వరల్డ్ సిటీస్ సమ్మిట్’లో సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి విజన్ను ప్రకటించారు. నాడు సైబరాబాద్లో ఎకరం రూ.2 లక్షల నుండి నేడు రూ.200 కోట్లకు పెరగడమే సంపద సృష్టికి నిదర్శనమన్నారు. ఒకే పిలుపుతో 35 వేల ఎకరాలిచ్చిన అమరావతి రైతులను అభినందిస్తూ.. 21 కి.మీ వాటర్ ఫ్రంట్, క్వాంటం కంప్యూటింగ్ హబ్, నెట్ జీరో లక్ష్యాలతో అమరావతిని ప్రపంచంలోనే అత్యుత్తమ గ్రీన్ ఫీల్డ్ సిటీగా నిర్మిస్తున్నామని తెలిపి, పెట్టుబడిదారులను ఆహ్వానించారు.
మరింత Chandrababu: సింగపూర్ సమ్మిట్లో సీఎం చంద్రబాబు నాయుడు ‘ఏఐ & అమరావతి’ రోడ్మ్యాప్..!Pawan Kalyan: మోడీకి అందుకే మద్దతిస్తున్న.. భద్రత లేని జీవితాలు వృధా
Pawan Kalyan: ముంబై 26/11 దాడుల సమయంలో దేశానికి ఒక బలమైన నాయకుడు కావాలని వారణాసిలో తన తండ్రి అస్తికలు నిమజ్జనం చేసేటప్పుడు కాశీ విశ్వనాథుడిని మొక్కుకున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. దేశం సంక్షోభంలో ఉన్నప్పుడు ఒక గొప్ప నాయకుడిని పుట్టించే శక్తి భారతదేశానికి ఉందన్న నాని పాల్కీవాలా మాటలను గుర్తుచేస్తూ.. కోట్లాది మంది భారతీయుల ఆకాంక్షల రూపమే నరేంద్ర మోదీ అని చెప్పారు. అభివృద్ధి కంటే దేశ భద్రతే ముఖ్యమని, అందుకే తమ సదస్సులో మోదీని అభినందిస్తూ మొదటి తీర్మానం పెట్టామని స్పష్టం చేశారు.
మరింత Pawan Kalyan: మోడీకి అందుకే మద్దతిస్తున్న.. భద్రత లేని జీవితాలు వృధాPawan Kalyan: కాక్రోచ్ పార్టీ పుట్టుకకు కారణం అదే.. జనసైనికులకు కీలక పిలుపు!
Pawan Kalyan: ఢిల్లీలో జనసేన నిర్వహిస్తోన్న మూడు రోజుల సభల తొలిరోజున పవన్ కల్యాణ్ మాట్లాడారు. వ్యక్తిగత లాభాలు, కురచ భావాల వల్లే ‘కాక్రోచ్ జనతా పార్టీలు’ వస్తాయని విమర్శించారు. చిన్న చీమలు సర్పంనైనా చంపేస్తాయన్న సుమతీ శతకాన్ని గుర్తుచేస్తూ.. చిన్న శక్తులు కలిస్తే బలమైన ప్రవాహం అవుతుందని, అందులో జనసేన చిక్కుకోకూడదని చెప్పారు. విభజనవాదానికి వ్యతిరేకంగా పోరాడాలని, జనసేనకు దేశభక్తే కీలకమని స్పష్టం చేశారు.
మరింత Pawan Kalyan: కాక్రోచ్ పార్టీ పుట్టుకకు కారణం అదే.. జనసైనికులకు కీలక పిలుపు!China: గుంటూరు మిర్చికి చైనా ‘రెడ్ సిగ్నల్’.. పెరిగిన పురుగుమందుల అవశేషాలు..!
Guntur Mirchi: గుంటూరు నుంచి పంపిన మిర్చి కంటైనర్లలో ప్రమాదకర పురుగుమందుల (మెథామిడోఫాస్) అవశేషాలు పరిమితికి మించి ఉన్నాయని చైనా మూడు కన్సైన్మెంట్లను తిరస్కరించింది. ముగ్గురు భారతీయ ఎగుమతిదారులపై తాత్కాలిక సస్పెన్షన్ విధించింది. దీనివల్ల ‘తేజ’ రకం మిర్చి ఎగుమతులు నిలిచిపోగా, స్పైసెస్ బోర్డ్ మరియు ఉద్యానవన శాఖ అధికారులు నాణ్యత నియంత్రణ చర్యలపై గుంటూరులో అత్యవసర సమీక్షలు నిర్వహిస్తున్నారు.
మరింత China: గుంటూరు మిర్చికి చైనా ‘రెడ్ సిగ్నల్’.. పెరిగిన పురుగుమందుల అవశేషాలు..!Pawan Kalyan: అధికారం కోసం పార్టీ పెట్టలేదు.. దేశ సమగ్రతను కాపాడటమే జనసేన లక్ష్యం!
Pawan Kalyan: జనసేన పార్టీ స్థాపించి 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఢిల్లీలో జరిగిన ప్రజాప్రతినిధుల సమావేశంలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. తాము అధికారం కోసం పార్టీ పెట్టలేదని, దేశ సమగ్రత, దేశభక్తే జనసేన లక్ష్యాలని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో 20 లక్షల మంది జనసైనికులు ఉన్నారన్న ఆయన, తెలంగాణ ఏర్పాటుపై వ్యతిరేకత లేదని, కాంగ్రెస్ విభజించిన తీరునే తప్పుపట్టారు. హైదరాబాద్లో సభకు పర్మిషన్ ఇవ్వనందుకే, జనసేన జాతీయవాదాన్ని వినిపించడానికి ఢిల్లీని వేదికగా ఎంచుకున్నట్లు వివరించారు.
మరింత Pawan Kalyan: అధికారం కోసం పార్టీ పెట్టలేదు.. దేశ సమగ్రతను కాపాడటమే జనసేన లక్ష్యం!