Chandrababu Naidu

AP Cabinet Meeting: ప్రారంభమైన క్యాబినెట్‌ సమావేశం.. 85కి పైగా ఎజెండా అంశాలకు ఆమోదం..?

AP Cabinet Meeting: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ క్యాబినెట్ భేటీ ఇప్పుడే ప్రారంభమైంది. ఈ సమావేశంలో దాదాపు 85కి పైగా ఎజెండా అంశాలపై చర్చించి ఆమోదం తెలపనున్నారు. రూ.34వేల కోట్ల SIPB పెట్టుబడులు, 35వేల ఉద్యోగాల కల్పనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు.

మరింత AP Cabinet Meeting: ప్రారంభమైన క్యాబినెట్‌ సమావేశం.. 85కి పైగా ఎజెండా అంశాలకు ఆమోదం..?
Nara Lokesh

Nara Lokesh: ఏపీ లక్ష్యం $2.4 ట్రిలియన్ల ఎకానమీ.. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలే ధ్యేయం

Nara Lokesh: రిపబ్లిక్ టీవీ సమ్మిట్-2026లో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. 2047 నాటికి ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యమన్నారు.

మరింత Nara Lokesh: ఏపీ లక్ష్యం $2.4 ట్రిలియన్ల ఎకానమీ.. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలే ధ్యేయం
Sai Krishna

Sai Krishna: హైకోర్టు ఆదేశాలతో కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీసీటీవీ హార్డ్ డిస్క్‌లు, డీవీఆర్‌లు సీజ్

Sai Krishna: విజయవాడ సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సిట్ దర్యాప్తు వేగవంతమైంది. సిట్ బృందం సాయికృష్ణ నివాసానికి వెళ్లి తల్లి విజయలక్ష్మి స్టేట్‌మెంట్ రికార్డ్ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు కృష్ణలంక పీఎస్ సీసీటీవీ హార్డ్ డిస్క్‌లను సీజ్ చేసిన పోలీసులు, నేడు వాటిని సీల్డ్ కవర్‌లో కోర్టుకు సమర్పించనున్నారు. ఏసీపీ దైవప్రసాద్ ఇచ్చిన 3 రోజుల నివేదికపై సిట్ చీఫ్ రవిప్రకాష్ సమీక్ష నిర్వహించారు. అలాగే కృష్ణలంక పీఎస్‌కు ఫోరెన్సిక్ బృందాలు చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నాయి.

మరింత Sai Krishna: హైకోర్టు ఆదేశాలతో కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీసీటీవీ హార్డ్ డిస్క్‌లు, డీవీఆర్‌లు సీజ్
Chandrababu: 

Chandrababu: ఏపీని దేశానికే ఆధ్యాత్మిక హబ్‌గా మారుస్తాం

Chandrababu:  అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అమరావతి ఉండవల్లి గుహల వద్ద జరిగిన ‘యోగాంధ్ర’ వేడుకల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఏపీని దేశానికి ఆధ్యాత్మిక హబ్‌గా మారుస్తామని, యువత ఒత్తిడి తగ్గించుకోవడానికి టెక్నాలజీతో పాటు యోగా, ఆధ్యాత్మికత అవసరమని చెప్పారు. యోగాకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన ప్రధాని మోదీ, బాబా రామ్‌దేవ్‌లను కొనియాడారు. అలాగే రాష్ట్రంలో పచ్చదనాన్ని 31% నుండి 50% కి పెంచుతామని సీఎం ప్రకటించారు. చంద్రబాబు విజన్‌ను బాబా రామ్‌దేవ్ ప్రశంసించారు.

మరింత Chandrababu: ఏపీని దేశానికే ఆధ్యాత్మిక హబ్‌గా మారుస్తాం
Chandrababu

Chandrababu: సాయికృష్ణ కుటుంబానికి సీఎం చంద్రబాబు భరోసా.. తప్పు చేస్తే ఎంతటివారైనా వదిలేది లేదు

Chandrababu: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సాయికృష్ణ అదృశ్యం కేసులో బాధితుడి తల్లి విజయలక్ష్మి, కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబును ఉండవల్లి నివాసంలో కలిశారు. తమకు న్యాయం చేయాలని కోరగా, ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు. ఈ కేసుపై సీనియర్ ఐపీఎస్ అధికారితో ఉన్నత స్థాయి దర్యాప్తు చేయిస్తున్నామని, తప్పు చేసిన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు.

మరింత Chandrababu: సాయికృష్ణ కుటుంబానికి సీఎం చంద్రబాబు భరోసా.. తప్పు చేస్తే ఎంతటివారైనా వదిలేది లేదు
Nara Lokesh

Nara Lokesh: కోల్‌కతాలో ఇమామీ, శ్రీ సిమెంట్స్, వీసా స్టీల్ అధినేతలతో మంత్రి నారా లోకేష్ భేటీ!

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే కీలక పారిశ్రామిక, తయారీ కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో మంత్రి నారా లోకేష్ కోల్‌కతాలో వీసా స్టీల్ ఎండీ విశాల్ అగర్వాల్, ఇమామీ గ్రూప్ డైరెక్టర్ ఆదిత్య అగర్వాల్, శ్రీ సిమెంట్స్ వైస్ చైర్మన్ ప్రశాంత్ బంగూర్‌లతో సమావేశమయ్యారు. ప్రధాని మోదీ సంస్కరణలను ప్రశంసించిన లోకేష్, ఏపీలోని విస్తారమైన తీరప్రాంతం, పోర్టులు, భూమి లభ్యత వంటి అనుకూల అంశాలను వివరించి పెట్టుబడులు పెట్టాలని కోరారు. ప్రభుత్వ చొరవలను పారిశ్రామికవేత్తలు అభినందించారు.

మరింత Nara Lokesh: కోల్‌కతాలో ఇమామీ, శ్రీ సిమెంట్స్, వీసా స్టీల్ అధినేతలతో మంత్రి నారా లోకేష్ భేటీ!
AP SSC Supplementary Results: 

AP SSC Supplementary Results: ఏపీ టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. ఈసారి 6.25% పెరిగిన పాస్ పర్సంటేజ్..

AP SSC Supplementary Results: ఏపీ పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా ద్వారా వీటిని ప్రకటించారు. ఈసారి మొత్తం 94,990 మందిలో 78,261 మంది ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాదితో పోలిస్తే పాస్ పర్సంటేజ్ 6.25% పెరిగింది. ప్రభుత్వ ’20 రోజుల యాక్షన్ ప్లాన్’ వల్లే ఈ అద్భుత ఫలితాలు సాధ్యమయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ లేదా 95523 00009 నంబర్ ద్వారా వాట్సాప్‌లోనే తమ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి ఫలితాలు పొందవచ్చు.

మరింత AP SSC Supplementary Results: ఏపీ టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. ఈసారి 6.25% పెరిగిన పాస్ పర్సంటేజ్..
Vijayawada

Vijayawada: సాయికృష్ణ కేసులో సంచలనం.. కృష్ణలంక సీఐ నాగరాజుపై ‘మర్డర్’ కేసు నమోదు

Vijayawada: విజయవాడ రౌడీషీటర్ సాయికృష్ణ మిస్సింగ్ కేసులో కృష్ణలంక సీఐ నాగరాజుపై మర్డర్ కేసు నమోదైంది. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదును సీపీ రాజశేఖర్‌బాబు స్వయంగా స్వీకరించి, సీఐపై BNS సెక్షన్లు 101(1), 127(4), 127(6) కింద కేసు నమోదు చేయించారు. ఈ లాకప్ డెత్ ఆరోపణల కేసు విచారణ అధికారిగా దిశా పీఎస్ ఏసీపీ దైవ ప్రసాద్ నియమితులయ్యారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు దర్యాప్తు వేగవంతమైంది.

మరింత Vijayawada: సాయికృష్ణ కేసులో సంచలనం.. కృష్ణలంక సీఐ నాగరాజుపై ‘మర్డర్’ కేసు నమోదు
Kodali Nani

Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు అనుమతి

Kodali Nani: 2021 పంచాయతీ ఎన్నికల సమయంలో చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్‌లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో వైకాపా నేత కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆ సమయంలో ఆయన మంత్రిగా ఉన్నందున విచారణకు ప్రభుత్వ పర్మిషన్ అవసరమవడంతో మూడేళ్లుగా ఈ కేసు పెండింగ్‌లో ఉంది. తాజాగా హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ అనుమతి ఉత్తర్వులు జారీ చేయడంతో కోర్టులో విచారణ ముందుకు సాగనుంది.

మరింత Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు అనుమతి
Kakinada Child Missing

Kakinada Child Missing: 500 ఎకరాలు.. థర్మల్ డ్రోన్లు.. 400 మంది సిబ్బంది! తండ్రి విచారణ.. క్లూ ఇస్తుందనుకున్న పెంపుడు కుక్క మృతి!

Kakinada Child Missing: కాకినాడ జిల్లాలో రెండేళ్ల జ్ఞానేశ్వరి అదృశ్యం కేసు మిస్టరీగా మారింది. తోటలోకి వెళ్లిన పాప కోసం 400 మంది సిబ్బంది, థర్మల్ డ్రోన్లతో 500 ఎకరాల్లో గాలిస్తున్నారు. పాపతో పాటు ఉండి, తిరిగి వచ్చిన పెంపుడు కుక్క కూడా అనుకోకుండా మృతి చెందడం కేసును సందిగ్ధంలో పడేసింది. కుటుంబ కలహాల కోణంలో తండ్రిని విచారిస్తున్న పోలీసులు, జంతువుల దాడి అనుమానంతో స్పై కెమెరాల బొమ్మలను కూడా ఏర్పాటు చేశారు.

మరింత Kakinada Child Missing: 500 ఎకరాలు.. థర్మల్ డ్రోన్లు.. 400 మంది సిబ్బంది! తండ్రి విచారణ.. క్లూ ఇస్తుందనుకున్న పెంపుడు కుక్క మృతి!