SSMB29: టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి రూపొందిస్తున్న SSMB29 చిత్రం ఇప్పటికే భారీ అంచనాల మధ్య షూటింగ్ జరుపుకుంటోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ అడ్వెంచర్ థ్రిల్లర్లో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఓ సినిమా ప్రమోషన్లో ఆయన SSMB29 గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Also Read: Kingdom: కింగ్ డమ్ టికెట్ రేట్లు పెంపు?
రాజమౌళి ఈ చిత్రాన్ని అసాధారణ రీతిలో తెరకెక్కిస్తున్నారని, ఇప్పటివరకు ఎవరూ ఊహించని విధంగా సినిమా ఉంటుందని పృథ్వీరాజ్ పేర్కొన్నారు. ఆయన స్వయంగా ఈ సినిమా విజన్ను ప్రశంసిస్తూ, ప్రేక్షకులకు అద్భుత అనుభవం ఖాయమని హామీ ఇచ్చారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తుండగా, ఈ కామెంట్స్తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.