Srinidhi Shetty: బాలీవుడ్లో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న నితీశ్ తివారి డైరెక్షన్లో ‘రామాయణం’ చిత్రం సంచలనం సృష్టిస్తోంది. రణ్బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణుడిగా నటిస్తున్న ఈ మెగా బడ్జెట్ చిత్రం ఇప్పటికే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే, సీత పాత్ర కోసం తొలుత ‘కేజీఎఫ్’ ఫేమ్ శ్రీనిధి శెట్టి ఆడిషన్ ఇచ్చినట్లు తాజాగా వెల్లడించింది. ‘హిట్-3’తో తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్న శ్రీనిధి, ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని పంచుకుంది.
Also Read: Puri Jagannadh: టార్గెట్ 60 అంటున్న పూరి జగన్నాధ్..?
Srinidhi Shetty: ‘కేజీఎఫ్’లో యశ్ సరసన హీరోయిన్గా నటించిన శ్రీనిధి, ‘రామాయణం’లో యశ్ రావణుడిగా, తాను సీతగా కనిపిస్తే ప్రేక్షకులకు కనెక్షన్ మిస్ అవుతుందేమోనని భావించినట్లు చెప్పింది. ఈ నేపథ్యంలో సీత పాత్ర సాయి పల్లవికి దక్కినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, ‘హిట్-3’లో తన పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని శ్రీనిధి ధీమా వ్యక్తం చేసింది. ఈ చిత్రం బాలీవుడ్లో కొత్త ట్రెండ్ సెట్ చేయడం ఖాయమని సినీ వర్గాలు అంటున్నాయి.
KGF చాప్టర్ 2 మెహబూబా సాంగ్ :