Mithun Reddy

Mithun Reddy: వైకాపా ఎంపీ మిథున్‌రెడ్డి నివాసాల్లో సిట్‌ సోదాలు

Mithun Reddy: ఏపీ మద్యం కుంభకోణం దర్యాప్తు కొత్త మలుపులు తీసుకుంది. తాజాగా వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి నివాసాలు, ఆఫీసులపై సిట్‌ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ దాడులు హైదరాబాద్‌, బెంగళూరు నగరాల్లో ఒకేసారి జరిగాయి.  ఫిల్మ్‌నగర్‌లోని ప్రశాసన్‌నగర్‌లో ఉన్న మిథున్‌రెడ్డి ఇంట్లో, అలాగే యూసఫ్‌గూడ గాయత్రీహిల్స్‌ ప్రాంతంలోని మరో నివాసంలోనూ సిట్‌ అధికారులు తనిఖీలు చేపట్టారు. అదేవిధంగా, బెంగళూరులోని ఆయన ఇంటి వద్ద కూడా అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.

Also Read: Environment: ప్లాస్టిక్‌తో ప్ర‌పంచానికి ఇంత ముప్పు ఉన్న‌దా?

ఈ సోదాలకు నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేయబడ్డాయి. ఎంపీ మిథున్‌రెడ్డి పేరు ఏపీ లిక్కర్‌ స్కామ్‌లో ఏ-4 నంబర్‌ ఆరోపితుడిగా ఉండటంతో, సిట్‌ ఈ దాడులను చేపట్టినట్లు తెలుస్తోంది. PLR ప్రాజెక్ట్స్‌ ఆర్థిక లావాదేవీలపై కూడా అధికారులు సమగ్ర విచారణ చేస్తున్నారు. లిక్కర్‌ డీలింగ్‌ల్లో వచ్చిన రూ.5 కోట్లు PLR ప్రాజెక్ట్స్‌ ఖాతాల్లోకి వెళ్లినట్లు సిట్‌ అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సిట్‌ దాడులు జరగడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మద్యం కుంభకోణంలో పలువురు ప్రముఖుల పేర్లు ఇప్పటికే వెలుగుచూశాయి. ఇప్పుడు మిథున్‌రెడ్డి ఇళ్లపై జరిగిన సోదాలు కేసు దర్యాప్తులో కొత్త మలుపు తీసుకురావచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *