Bhadradri Kothagudem

Bhadradri Kothagudem: రూ.40,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ ఎస్ఐ

Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక పోలీసు అధికారి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు చిక్కాడు.

మణుగూరు ఎస్ఐ అరెస్ట్
ఈ ఘటన మణుగూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇద్దరు వ్యక్తులపై స్టేషన్‌లో కేసు నమోదై ఉంది. ఆ కేసులో వారిని అరెస్టు చేయకుండా, కేవలం నోటీసులు ఇచ్చి పంపించడానికి ఎస్ఐ బత్తిన రంజిత్ లంచం డిమాండ్ చేశారు. ఎస్ఐ రంజిత్ ఈ పని కోసం ఏకంగా రూ.40,000 లంచం అడిగారు.

ఏసీబీకి ఫిర్యాదు
బాధిత వ్యక్తులు నేరుగా ఏసీబీ అధికారులను ఆశ్రయించి, ఎస్ఐ లంచం అడుగుతున్నట్లు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో పట్టుకున్నారు.

లంచం డబ్బులు తీసుకుంటుండగా ఎస్ఐ రంజిత్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని, అతనిపై కేసు నమోదు చేశారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *