ration card digitization

Ration Card Digitization: రేషన్ వ్యవస్థ డిజిటలైజేషన్.. కోట్లాది నకిలీ కార్డుల తొలగింపు

Ration Card Digitization: రేషన్‌గా పిలిచే ప్రజా పంపిణీ వ్యవస్థను ‘డిజిటలైజేషన్‌’ చేయడంతో 5.80 కోట్ల నకిలీ రేషన్‌కార్డులను గుర్తించి రద్దు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.వినియోగదారుల సంక్షేమం, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ నిన్న విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో, కేంద్ర ప్రభుత్వం ఈ వివరాలు చెప్పింది.
రేషన్ ప్రక్రియను డిజిటలైజ్ చేయడానికి, పారదర్శకత తీసుకురావడానికి,  పంపిణీ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం నిరంతరం అనేక కార్యక్రమాలు చేపడుతోంది. దీని ద్వారా అర్హులకు రేషన్‌ ప్రయోజనాలు అందేలా చూడాలనేది ప్రభుత్వ ధ్యేయం.
Ration Card Digitization: ప్రస్తుతం దేశవ్యాప్తంగా 20.4 కోట్ల కుటుంబాలకు రేషన్ కార్డులు ఉన్నాయి. దీని ద్వారా 80.6 కోట్ల మంది లబ్ధి పొందుతున్నారు.ఇందులో 99.8 శాతం రేషన్ కార్డులు ఇ-కెవైసి అనే ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ద్వారా ధ్రువీకరించడం జరిగింది. అలాగే, 98.7 శాతం మంది వినియోగదారులు ఆధార్‌ను ధృవీకరించారు. ఈ ప్రాసెస్  ద్వారా 5.80 కోట్ల నకిలీ రేషన్ కార్డులను గుర్తించి రద్దు చేశారు.
దేశవ్యాప్తంగా, 5.33 లక్షల POS లేదా పాయింట్ ఆఫ్ సేల్స్ ఉన్నాయి.  ఇక్కడ ఉత్పత్తులను రేషన్ దుకాణాల్లో పంపిణీ చేస్తారు. దీని ద్వారా అర్హులైన వారికే రేషన్ వస్తువులు అందేలా చూస్తారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *