Narendra Modi: స్వదేశీ యుద్ధనౌక ఐఎన్ఎస్ విక్రాంత్ భారత నావికాదళ శౌర్యానికి ప్రతీకగా నిలిచిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గోవా–కార్వార్ తీరంలో ఉన్న ఈ స్వదేశీ విమాన వాహక నౌకలో నేవీ సిబ్బందితో కలిసి ఈ సంవత్సరం దీపావళి జరుపుకోవడం తన అదృష్టమని ఆయన పేర్కొన్నారు.
“పాకిస్తాన్కు నిద్రలేని రాత్రులు ఇచ్చింది INS విక్రాంత్”
“ఆపరేషన్ సిందూర్ సమయంలో విక్రాంత్ పాకిస్తాన్కు నిద్రలేని రాత్రులు ఇచ్చింది. ఇది కేవలం ఒక యుద్ధనౌక మాత్రమే కాదు 21వ శతాబ్దపు భారతదేశం కృషి, ప్రతిభ, నిబద్ధతకు ప్రతీక” అని మోదీ అన్నారు.“యుద్ధం ప్రారంభం కాకముందే శత్రువుకు భయం కలిగించే శక్తి INS విక్రాంత్ సొంతం” అని ఆయన గర్వంగా తెలిపారు.
నావికాదళం హై అలర్ట్లో
ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడుల తర్వాత అరేబియా సముద్రంలో నావికాదళం హై అలర్ట్లోకి వెళ్లింది. పాకిస్తాన్ నేవీ దాడి చేసే అవకాశం ఉన్నందున హెచ్చరికలు జారీ చేయగా, INS విక్రాంత్ను కేంద్రంగా చేసుకుని 8–10 యుద్ధనౌకలను మోహరించారు.
ఈ చర్య, భారత నావికాదళం శాంతికాలంలో చేసిన అత్యంత విస్తృతమైన రియల్-టైమ్ ఆపరేషన్లలో ఒకటిగా గుర్తించబడింది.
#WATCH | Prime Minister Narendra Modi says, “… Just a few months ago, we witnessed how the very name Vikrant sent waves of fear across Pakistan. Such is its might — a name that shatters the enemy’s courage even before the battle begins. This is the power of INS Vikrant… On… pic.twitter.com/TL03Z9CFdg
— ANI (@ANI) October 20, 2025
“సముద్రంపై సూర్యోదయం నా దీపావళిని ప్రత్యేకం చేసింది”
యుద్ధనౌకలో రాత్రి గడిపిన అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ మోదీ అన్నారు. “మీ అంకితభావం అపారమైనది. సముద్ర మధ్యలో రాత్రి గడపడం, తెల్లవారుజామున సూర్యోదయం చూడటం నా దీపావళిని మరింత ప్రత్యేకంగా మార్చాయి. ఒక వైపు అనంతమైన ఆకాశం, మరో వైపు INS విక్రాంత్ అనే శక్తివంతమైన దిగ్గజం ఇది నిజమైన భారతశక్తి ప్రతీక.”
ఇది కూడా చదవండి: Bigg Boss Telugu 9: బిగ్బాస్ నుండి భరణి అవుట్..పోతు పోతు లక్షల రెమ్యూనరేషన్ తీసుకొని వేలాడు
నావికాదళ సిబ్బందికి ప్రశంసలు
నావికాదళ సిబ్బంది దేశభక్తి గీతాలు పాడుతూ ఆపరేషన్ సిందూర్ను స్మరించగా, “యుద్ధభూమిలో సైనికుడు ఏం అనుభవిస్తాడో పదాలతో వివరించలేము” అని ప్రధాని వ్యాఖ్యానించారు.
“మేక్ ఇన్ ఇండియా” స్ఫూర్తికి చిహ్నం
యుద్ధనౌకను జాతికి అంకితం చేసే సమయంలో ఐఎన్ఎస్ విక్రాంత్ కొత్త నావికాదళ జెండాతో స్వదేశీ శక్తిని ప్రతిబింబిస్తోందని మోదీ గుర్తుచేశారు. “ఐఎన్ఎస్ విక్రాంత్ స్వావలంబన భారతానికి చిహ్నం. ఇది మేక్ ఇన్ ఇండియా విజయానికి గొప్ప నిదర్శనం.”
ఇది కూడా చదవండి: Rain Alert: తుఫాను అలర్ట్.. రానున్న 4 రోజులు ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు!
స్వదేశీకరణ వైపు వేగంగా భారత రక్షణ రంగం
గత 11 ఏళ్లలో భారత రక్షణ ఉత్పత్తి మూడు రెట్లు పెరిగిందని, ప్రతి 40 రోజులకు ఒక కొత్త యుద్ధనౌక లేదా జలాంతర్గామి నేవీలో చేరుతోందని మోదీ తెలిపారు. బ్రహ్మోస్ క్షిపణులపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిమాండ్ను ప్రస్తావిస్తూ, “భారతదేశం త్వరలో అగ్ర రక్షణ ఎగుమతిదారుగా నిలుస్తుంది” అని విశ్వాసం వ్యక్తం చేశారు.
స్టార్టప్లకు ప్రత్యేక ప్రశంస
ఈ మార్పులో కీలక పాత్ర పోషిస్తున్న స్టార్టప్లు, స్వదేశీ రక్షణ విభాగాలను మోదీ ప్రశంసించారు. “కొత్త తరం ఆవిష్కర్తలు భారత రక్షణ రంగానికి కొత్త దిశ చూపుతున్నారు” అన్నారు.