Nadendla Manohar: జనసేన పార్టీ రాజకీయ ప్రస్థానంలో కీలక పాత్ర పోషిస్తున్న మంత్రి నాదెండ్ల మనోహర్ తన రాజకీయ ప్రయాణంలోని ముఖ్య ఘట్టాన్ని గుర్తుచేసుకున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో కలిసి తన రాజకీయ జీవితం ప్రారంభమైన రోజును గుర్తు చేసుకుంటూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా భావోద్వేగంగా స్పందించారు.
2018 అక్టోబర్ 12న పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తిదాయక నాయకత్వంలో నా రాజకీయ ప్రయాణం మొదలైంది. తిత్లీ తుఫాన్ తర్వాత శ్రీకాకుళంలో యువతతో కలిసి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుపై చర్చించిన రోజులు ఇప్పటికీ గుర్తుంటాయి. ఈ ఏడేళ్లలో సేవ, స్ఫూర్తి, సంకల్పం నిండిన రాజకీయ పథం కొనసాగుతోంది. పవన్ గారి దిశానిర్దేశం ఎల్లప్పుడూ నాకు బలాన్నిచ్చింది అని నాదెండ్ల మనోహర్ ట్వీట్ చేశారు. అలాగే, పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలకు తన కృతజ్ఞతలు తెలిపారు.
ఇది కూడా చదవండి: Upasana: దేశ ఆరోగ్యానికి క్రీడలే ఆధారం
ఈ ట్వీట్పై పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. ఆయన పేర్కొంటూ.. వాళ్లు ఉచితాల కోసం అడగలేదు… సంక్షేమ పథకాల కోసం కోరలేదు. ఒకే మాట చెప్పారు ‘మాకు ఉచితాలు కాదు, భవిష్యత్తు కావాలి’. ఇది ఆంధ్రప్రదేశ్ యువత నిజమైన స్వరం. 25 ఏళ్ల భవిష్యత్తును నిర్మించాలనే వారి ఆశయాన్ని నెరవేర్చేందుకు నేను ఎప్పుడూ యువతతో ఉండబోతున్నాను అని చెప్పారు.
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు యువతలో కొత్త ఉత్సాహాన్ని నింపగా, నాదెండ్ల మనోహర్ ట్వీట్ జనసేనలోని ఐక్యత, స్ఫూర్తిని ప్రతిబింబించింది. ఇద్దరి మధ్య ఈ ట్వీట్ పరస్పరం జనసేన రాజకీయ ఆత్మను మరోసారి ప్రజల ముందుకు తెచ్చింది.
I remember quite vividly about the conversation we had with them. They were not asking for freebies, they were not asking for any welfare schemes but they have said firmly ‘ give us 25 years of future not freebies.’
We need to tap the true potential of our youth. I will keep… https://t.co/8bWCtI1ryL— Pawan Kalyan (@PawanKalyan) October 12, 2025