HYDERABAD: అద్దె అడుగుతుందని ఓనర్ వేలు విరిగేల కొరికిండు..

HYDERABAD: హైదరాబాద్‌లోని మధురానగర్‌లో చిన్నపాటి ఆర్థిక వివాదం ఘోరానికి దారితీసింది. చీటీ డబ్బులు, ఇంటి అద్దె విషయంలో జరిగిన తగాదా ఓ మహిళ చేతి చూపుడు వేలును కోల్పోయేలా చేసింది. ఓ వ్యక్తి కిరాతకంగా ఆమె వేలును కొరికేయడంతో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది. వివరాల్లోకి వెళితే, జవహర్‌నగర్‌కు చెందిన సుజితకు మధురానగర్‌లో ఓ పెంట్‌హౌస్ ఉంది. ఆ ఇంట్లో మమత అనే మహిళ గత మూడేళ్లుగా అద్దెకు ఉంటోంది. సుజిత మమత వద్ద చీటీ వేసింది. దాంతో సుజితకు మమత చే సుమారు రూ.30,000 చీటీ డబ్బులు చెల్లించాల్సి వచ్చింది. ఇటీవల మమత ఇంటిని ఖాళీ చేసి తన స్నేహితురాలు సుప్రియకు అద్దెకు ఇచ్చింది.

అయితే వారం రోజులకే సుప్రియ ఎటువంటి సమాచారం లేకుండానే ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయింది. ఇంటి అద్దె కూడా చెల్లించలేదు. ఈ నేపథ్యంలో, చీటీ డబ్బులు తిరిగి పొందేందుకు మమత తన భర్త హేమంత్‌తో కలిసి సుజితను కలుసుకుంది. ఇద్దరికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకోగా, సుజిత తల్లి లత (వయస్సు 45) వారిని శాంతింపజేయడానికి ప్రయత్నించింది. కానీ ఆవేశానికి లోనైన హేమంత్, లత కుడి చేతి చూపుడు వేలును బలంగా కొరికి తెగిపోయేలా చేశాడు. తీవ్ర రక్తస్రావంతో బాధితురాలు ఆసుపత్రికి తరలించబడింది. కానీ వైద్యులు ఆ వేళిని తిరిగి అతికించలేమని స్పష్టం చేశారు.

సూచన అందుకున్న మధురానగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. నిందితుడు హేమంత్‌ను అరెస్ట్ చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. చిన్నపాటి ఆర్థిక వివాదం ఇంతటి దారుణానికి దారితీయడం బాధాకరమని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *