Mamata banerjee: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగరాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆమె ఈ కుంభమేళాను “మహా కుంభ్” కాదు “మృత్యు కుంభ్” అని అభివర్ణించారు. కుంభమేళా అంటే తనకు గౌరవం ఉందని, పవిత్ర గంగమ్మ తల్లి పట్ల తనకు పూజ్యభావం ఉందని ఆమె తెలిపారు. కానీ యూపీలో జరుగుతున్న మహా కుంభమేళాకు వెళ్లి ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కేవలం వీఐపీల కోసమే ఏర్పాట్లు చేసిందని, సామాన్యులకు కనీస సదుపాయాలు కల్పించడంలో విఫలమైందని మమతా విమర్శించారు. కుంభమేళాలో సంపన్నులు రూ.1 లక్ష ఖర్చు చేసి టెంట్లు సొంతం చేసుకుంటున్నారని, కానీ పేదవాళ్లు అంత ఖర్చు చేయగలరా? అని ఆమె ప్రశ్నించారు.
తొక్కిసలాట జరిగే అవకాశాలు ఉన్నప్పుడు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అని యోగి ప్రభుత్వం మీద మమతా బెనర్జీ ప్రశ్నలు పెట్టారు. ప్రణాళిక లేకుండా ఇంతటి భారీ కార్యక్రమం నిర్వహిస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు.

