అనగనగా ఒక ఊరు . అక్కడో పెద్దాయన . కష్టపడి బంగారం ఉంగరం నవరత్నాలలో చేయించుకున్నాడు . దానిని వెలికి పెట్టుకున్నాడు . అయితే , ఆ ఉంగరం కొద్దిగా చిన్నది అయింది . అయినా ఏదోలా వెలికి ఎక్కించుకున్నాడు . తరువాత అది బిగిసిపోయింది . దానిని తీద్దామని ప్రయత్నించాడు . వెలికి సబ్బు రాశాడు అయినా రాలేదు . . అల రాత్రి చాలా సేపు ప్రయత్నించి అలసిపోయి నిద్ర పోయాడు . ఉదయం నిద్ర లేచేసరికి వేలు వాచిపోయింది . దీంతో వెంటనే కంసాలి దగ్గరకు వెళ్ళాడు . . ఉంగరం తీయమని అడిగాడు . ఆ కంసాలి చాలా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో ఇక చాలా కష్టం.. ఆసుపత్రికి వెళ్లి డాక్టర్ కి చూపించమని చెప్పాడు . అయితే , ఆ పెద్దాయనకు వెంకటేశ్వర స్వామి అంటే మహా భక్తి . దీంతో అతను వేంకటేశుని ప్రార్ధించారు . గోవిందునికి మొక్కుకున్నాడు . స్వామీ ఉంగరం వచ్చేస్తే నీ కొండకు వచ్చి ఆ ఉంగరం నీ హుండీలో వేస్తాను అని మొక్కుకున్నాడు . మరి ఆపద మొక్కుల వాడు కదా . . భక్తుడి కోరికలు తీర్చే భక్తవత్సలుడు కూడాను . . వెంటనే ఉంగరం ఊడి వచ్చేలా చేశాడు గోవిందుడు .
చూశావా . . వేంకటేశుడు మొక్కితే ఎలా మన బాధలు తీరుస్తాడో అంటూ ఆ పెద్దాయన తన భార్యకు చెప్పి . . పద తిరుపతి అని బయలుదేర దీశాడు . వాళ్లిద్దరూ దారిలో ఉండగా బంగారం ఖరీదు 100 రేట్లు పెరిగినట్టు వార్తలు వచ్చాయి . దీంతో భార్యాభర్తలు ఇద్దరూ . . అయ్యో . . దేవుడికి మనం ఇస్తామన్నది తక్కువ రేటు ఉన్నపుడు కదా . . అందుకని అప్పటి ఉంగరం ఖరీదు డబ్బు హుండీలో వేద్దామని అనుకున్నారు . అదే దేవుడికి కూడా చెప్పేశారు . హుండీ దగ్గరకు వచ్చి ఆ బంగారం అప్పటి ఖరీదు ఇంతే స్వామీ అది హుండీలో వేసేస్తున్నా అని చెప్పుకున్నారు . విష్ణువు నవ్వుకున్నాడు . ఆ పెద్దాయన హుండీలో డబ్బులు వేశాడు . దాంతో పాటుగా ఉంగరం జారీ హుండీలో పడిపోయింది .
అదీ సంగతి . . దేవుడితో గేమ్స్ అదీ వడ్డీకాసులవాడితో ఆడితే . . ఇలానే ఉంటుంది . వడ్డీతో సహా వసూలు అయిపోతుంది .
ప్రముఖ సినీనటుడు . . రచయిత తనికెళ్ల భరణి శివోహం కార్యక్రమంలో చెప్పిన పిట్టా కథ ఇది . ఇది విన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు . ఆహూతులంతా గోవిందా . . గోవిందా అనుకున్నారు .

