Earthquake

Earthquake: ఇండోనేషియాలో మరోసారి భూకంపం.. 6.2గా తీవ్రత నమోదు

Earthquake: ఇండోనేషియాలో మరోసారి భారీ భూకంపం సంభవించి ప్రజలను భయాందోళనలకు గురి చేసింది. బుధవారం రోజున సులవేసి ద్వీపం యొక్క ఉత్తర తీరంలో 6.2 తీవ్రతతో భూకంపం నమోదైనట్లు ఇండోనేషియా జియోఫిజిక్స్ ఏజెన్సీ (BMKG) తెలిపింది.

సునామీ ప్రమాదం లేదు

ఈ భూకంపం సులవేసి ఉత్తర తీరంలో సంభవించింది. ఈ భూకంపం వారం రోజుల్లో సంభవించిన అతిపెద్ద రెండో భూకంపంగా BMKG పేర్కొంది. అయితే, ఈ భూకంపం కారణంగా సునామీ ప్రమాదం లేదని అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతానికి, ఈ తాజా భూకంపం వల్ల సంభవించిన ఆస్తి నష్టం లేదా ప్రాణ నష్టం గురించి అధికారులు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.

ఇది కూడా చదవండి: Nara Lokesh: టీడీపీ సీనియర్ నేతలపై లోకేష్‌ ఆగ్రహం

ఇటీవల సంభవించిన ఇతర భూకంపాలు

ఇండోనేషియా సహా పలు ప్రాంతాల్లో ఇటీవల భూకంపాలు తరచూ సంభవిస్తున్నాయి మలుకు దీవుల సమీపంలో బండా సముద్రంలో దాదాపు 137 కిలోమీటర్ల లోతులో 6.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. అప్పుడు కూడా సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు. సోమవారం రోజున ఆప్ఘనిస్థాన్‌లో మజార్-ఎ-షరీఫ్ సమీపంలో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించింది.

ఈ ఘటనలో 20 మంది చనిపోగా, వందలాది మంది గాయపడ్డారు. నగరంలోని చారిత్రాత్మక బ్లూ మసీద్ కూడా ఈ భూకంపం ధాటికి దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు.ఇండోనేషియా భూకంపాల పరంగా అత్యంత సున్నితమైన ప్రాంతంలో ఉన్నందున, అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *