Jogulamba Gadwal

Jogulamba Gadwal: జోగులాంబ గద్వాల్ జిల్లా పిడుగుపడి ముగ్గురు మృతి

Jogulamba Gadwal: జోగులాంబ గద్వాల్ జిల్లాలోని అయిజ మండలం భూంపురంలో బుధవారం సాయంత్రం జరిగిన ఒక విషాద ఘటనలో ముగ్గురు కూలీలు పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మరణించారు. ఈ దుర్ఘటనలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే, భూంపురం గ్రామానికి చెందిన రైతులు పొలంలో పత్తి విత్తనాల పనులు చేసుకుంటున్నారు. సాయంత్రం సమయంలో అకస్మాత్తుగా వర్షం ప్రారంభం కావడంతో, కూలీలు అందరూ పొలంలో ఉన్న ఒక వేప చెట్టు కింద తలదాచుకున్నారు. అదే సమయంలో, భారీ ఉరుములతో కూడిన మెరుపు ఒకటి ఆ చెట్టుపై పడింది.

Also Read: Amaravati: గుడ్ న్యూస్ ఆటో డ్రైవర్లకు 15000..

ఈ పిడుగుపాటుతో, భూంపురం గ్రామానికి చెందిన సర్వేశ్ (19), పార్వతి (28), పులికల్ గ్రామానికి చెందిన సౌభాగ్యమ్మ (45) అక్కడికక్కడే మరణించారు. అలాగే, రాజు, జ్యోతి, తిమ్మప్ప, కావ్య అనే మరో నలుగురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు, అక్కడ గాయపడ్డవారికి చికిత్స అందిస్తున్నారు.

ఈ ఘటనతో భూంపురం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆసుపత్రి వద్దకు చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Fraud Case: నుదుట సింధూరం పెట్టి పెళ్లి అయిందని బురిడీ.. యువ‌తిని మోస‌గించిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *