Kurnool Bus Accident:

Kurnool Bus Accident: క‌ర్నూలు బ‌స్సు ప్ర‌మాదంలో ఇద్ద‌రు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు స‌జీవ‌ద‌హ‌నం

Kurnool Bus Accident:ఏపీలోని క‌ర్నూలు జిల్లాలో జ‌రిగిన ఘోర దుర్ఘ‌ట‌న‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల‌యిన ఇద్ద‌రు యువ‌తులు స‌జీవ ద‌హ‌నం అయ్యారు. హైద‌రాబాద్ నుంచి బెంగ‌ళూరుకు వెళ్త‌న్న బ‌స్సు.. ఓ బైక్‌ను ఢీకొన‌డంతో అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. ఈ ఘ‌ట‌న‌తో బ‌స్సు ద‌హ‌న‌మైంది. డోర్ లాక్ కావ‌డంతో ప్ర‌యాణికులంద‌రూ బ‌య‌ట‌ప‌డ‌లేక‌పోయారు. సుమారు 20 మందికి పైగా చ‌నిపోయారు. వారిలో ఆ ఇద్ద‌రు కూడా ఉన్నారు.

Kurnool Bus Accident:తెలంగాణ‌లోని యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా గుండాల మండ‌లం వ‌స్తాకొండూరు గ్రామానికి చెందిన అనూష‌రెడ్డి, ఏపీలోని బాప‌ట్ల జిల్లా య‌ద్ధ‌న‌పూడి మండ‌లం పూస‌పాడుకు చెందిన గ‌న్న‌మ‌నేని ధాత్రి (27) బెంగ‌ళూరులో వేర్వేరు సాఫ్ట్‌వేర్ కంపెనీల‌లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఆ ఇద్ద‌రు యువ‌తులు దీపావ‌ళి పండుగ కోసం త‌మ ఇళ్ల‌కు వ‌చ్చి, తిరుగు ప్రయాణంలో ఈ ఘోర దుర్ఘ‌ట‌న చోటుచేసుకున్న‌ది. ఈ ఘ‌ట‌న‌లో ప్రాణాలు కోల్పోయారు.

Kurnool Bus Accident:దీపావ‌ళి పండుగ కోసం అనూష‌రెడ్డి త‌మ సొంతూరైన వ‌స్తాకొండూరుకు వెళ్ల‌గా, ధాత్రి హైద‌రాబాద్‌లో ఉండే త‌న మేన‌మామ వ‌ద్ద‌కు వెళ్లింది. ఆ ఇద్ద‌రూ బెంగ‌ళూరు వెళ్లేందుకని హైద‌రాబాద్ నుంచి బెంగ‌ళూరు వెళ్తున్న వేమూరి-కావేరి ట్రావెల్స్ బ‌స్సును ఎక్కారు. ఖైర‌తాబాద్‌లో అనూష‌రెడ్డి బ‌స్సు ఎక్కింది. ఆ ఇద్ద‌రూ తెల్లారితే త‌మ కంపెనీల‌లో ఉద్యోగ విధుల్లో చేరి హాయిగా ఉండేవారు. కానీ విధి వ‌క్రించి బ‌స్సు ప్ర‌మాద ఘ‌ట‌న‌లో వారిద్ద‌రూ స‌జీవ ద‌హ‌న‌మై కాన‌రాని లోకాల‌కు వెళ్లారు. ఇటు వారి కుటుంబాల్లో, అటు వారు ప‌నిచేస్తున్న కంపెనీల‌లో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *