KTR

KTR: బీజేపీ మోసం రాముడికే అర్థమైంది, కానీ కరీంనగర్ ప్రజలకు కాదు!

KTR: బీజేపీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ మోసం దేవుడు రాముడికే అర్థమైందని, అందుకే అయోధ్యలో బీజేపీని ఓడించారని ఆయన ఎద్దేవా చేశారు. కానీ కరీంనగర్ ప్రజలు మాత్రం ఇంకా బీజేపీకే ఓటు వేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

బీజేపీపై కేటీఆర్ విమర్శలు
బీజేపీ మోసపూరిత పాలన: “అవసరం లేకున్నా వేసిన జీఎస్టీని తీసేసి పండుగ చేసుకోండి అంటున్నారు. ప్రధాని మోడీ చెప్పినట్లు రూ. 15 లక్షలు ఏమయ్యాయి?” అని కేటీఆర్ ప్రశ్నించారు. దేవుడి పేరు చెప్పి ఓట్లు వేయించుకోవడం మాత్రమే బీజేపీకి తెలుసని ఆయన ఆరోపించారు.

కరీంనగర్ ప్రజల నిర్ణయంపై ఆవేదన: “కరీంనగర్‌లో ఒక్క బడి కూడా తేలేదు, కనీసం గుడి కూడా కట్టలేదు. అయినా కరీంనగర్ వాసులు బీజేపీకే ఓటు వేస్తున్నారు. అయోధ్యలో బీజేపీ మోసం ఆ దేవుడు రాముడికి కూడా అర్థమైంది, అందుకే అక్కడ బీజేపీని ఓడించారు. కానీ కరీంనగర్‌లో మాత్రం ఇంకా బీజేపీనే గెలిపిస్తున్నారు” అని కేటీఆర్ అన్నారు.

కాంగ్రెస్ పాలనపై మండిపడ్డ కేటీఆర్
కాంగ్రెస్ మాటలు నమ్మిన ప్రజలు: కాంగ్రెస్ దొంగ మాటలను హైదరాబాద్ ప్రజలు నమ్మలేదని, కానీ ఊళ్ళలో ప్రజలు నమ్మి మోసపోయారని కేటీఆర్ అన్నారు. “చాలా మంది మా ఎమ్మెల్యే ఓడిపోయినా, కేసీఆర్ గెలుస్తాడులే అనుకున్నారు. అందరూ అలాగే అనుకోవడంతో కేసీఆర్ సీఎం కాలేకపోయారు. బంగారు పళ్ళెంలో పెట్టి ఇచ్చిన తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం అగమ్యం చేసింది” అని ఆయన మండిపడ్డారు.

బీఆర్ఎస్‌లోకి చేరికలు ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లాకు చెందిన డాక్టర్ రోహిత్ రెడ్డి, గౌతమ్ రెడ్డిలు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *