PKL 2024: ప్రొ కబడ్డీ సీజన్-11లో జైపుర్ పింక్ పాంథర్స్ పుంజుకుంది. గత మూడు మ్యాచ్ల్లో టైతో పాటు రెండు ఓటములు ఎదుర్కొన్న జట్టు.. మళ్లీ విజయాల బాట పట్టింది. గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన యుపి యోధాస్ తో జరిగిన పోరులో జైపుర్ 33-30తేడాతో విజయం సాధించింది. రెండు జట్లూ హోరాహోరీగా తలపడిన ఈ మ్యాచ్ లో ఫస్టాఫ్ సమయానికి యూపీ 17-15తో ఆధిక్యంలో నిలిచింది. కానీ బ్రేక్ తర్వాత పుంజుకున్న జైపుర్ కీలక సమయంలో పాయింట్లు రాబట్టి విజయాన్ని సొంతం చేసుకుంది. నీరజ్ నర్వాల్ 9 పాయింట్లు, అర్జున్ దేశ్వాల్ 5 పాయింట్లు, రెజా 5 పాయింట్లు సాధించి జట్టును గెలిపించారు. మరో మ్యాచ్లో యు ముంబా 32-26తో దబంగ్ ఢిల్లీని ఓడించింది.
