Hyderabad: శ్రీశైలం సమీపంలోని ఈగల పెంట, దోమల పెంట గ్రామాల పేర్లను అధికారికంగా మార్చుతూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామాల నూతన పేర్లు ఈ విధంగా ఉన్నాయి:
🔹 ఈగల పెంట ➡️ కృష్ణగిరి
🔹 దోమల పెంట ➡️ బ్రహ్మగిరి
ఈ మార్పులను అనుసరించి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, శాశ్వత సవరించిన బోర్డులు, రికార్డులు, గుర్తింపు పత్రాలు తదితరాల్లో కొత్త పేర్లను అమలు చేయాలని సంబంధిత అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
ఈ మార్పుతో గ్రామాల పేర్లకు కొత్త పౌరాణిక, సాంస్కృతిక ప్రాముఖ్యత చేకూరుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.