IPL 2025: ఐపీఎల్ లో అరంగేట్రం చేసిన తొలి సీజన్ లోనే టైటిల్తో అదరగొట్టిన జట్టు గుజరాత్ టైటాన్స్. ఆ సమయంలో జరిగిన మెగా వేలంలో వారు కొన్న ఆటగాలని చూసి నవ్వుకున్న వారు ఆ తర్వాత వారు టైటిల్ విజేతగా నిలిస్తే నోర్లు వెల్లబెట్టారు. తొలి సీజన్ లో టైటిల్ విజేతగా నిలిచి రెండవ సీజన్ లో రన్నరప్ గా నిలిచింది గుజరాత్ టైటాన్స్. రెండవ సీజన్ కూడా జడేజా చివరిలో కళ్ళు చెదిరే బౌండరీలు కొట్టకపోయి ఉంటే వీరి సొంతమే అయ్యేది. అయితే ఇప్పుడు అలాంటి గుజరాత్ టైటాన్స్ జట్టు యాజమాన్యం మారనుంది. ఆ వివరాల్లోకి వెళితే…
ఐపీఎల్ లో ఉండే 10 ఫ్రాంచైజీలలో గుజరాత్ టైటాన్స్ ఒకటి. 2021లో CVC క్యాపిటల్ పార్ట్నర్స్ (ఇరేలియా కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్) గుజరాత్ టైటాన్స్ను స్వాధీనం చేసుకున్నారు. 2022 సీజన్లో ఈ జట్టు ఐపీఎల్లో ప్రవేశించింది. అయితే, ఇటీవల CVC క్యాపిటల్ పార్ట్నర్స్ ఒక కీలక నిర్ణయాన్ని తీసుకున్నట్లు సమాచారం. వారు దాదాపు 67 శాతం వాటాను విక్రయించడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. ఈ వాటాను భారత వ్యాపార సంస్థ టొరెంట్ కొనుగోలు చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
టొరెంట్ గ్రూప్ గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీలో మూడింట రెండు వంతులు అనగా 67 శాతం కొనుగోలు చేసేందుకు చర్చలు జరుపుతోంది. CVC క్యాపిటల్ పార్ట్నర్స్ యాజమాన్యం 4 సంవత్సరాల లాక్ ఇన్ పీరియడ్ 2025 ఫిబ్రవరితో ముగుస్తుంది. అప్పుడు వారు వాటాలను విక్రయించుకోవచ్చు. టొరెంట్ గ్రూప్ భారతదేశంలో ఫార్మాస్యూటికల్ రంగంలో ప్రముఖంగా ఉంది. 2021లో BCCI రెండు కొత్త జట్ల కోసం బిడ్లను ఆహ్వానించినప్పుడు టొరెంట్ గ్రూప్ ఆసక్తి చూపింది. యాజమాన్య మార్పుకు BCCI ఆమోదం అవసరం. రాబోయే రోజుల్లో BCCI అప్రూవల్ లభిస్తుంది. అని ఐపీఎల్ వర్గాలు తెలిపాయి.
Also Read: Viral News: వార్నీ.. హనుమంతుడిలా శ్రీలంకను ఒకరోజంతా చీకట్లో పెట్టేశాడుగా
IPL 2025: టొరెంట్ గ్రూప్ దాదాపు రూ. 41,000 కోట్ల విలువను కలిగి ఉంది. 2021లో రెండు ఐపీఎల్ ఫ్రాంచైజీలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపింది. గుజరాత్ జట్టు వాల్యూ రూ. 4,653 కోట్లు కాగా, లక్నో జట్టువిలువ రూ. 4,356 కోట్లగా వేలం వేశాయి.
గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ ఐపీఎల్లో అడుగుపెట్టగానే అదరగొట్టింది. 2022 మొదటి సీజన్లో హార్దిక్ పాండ్య నేతృత్వంలో టైటిల్ గెలుచుకుంది. తర్వాత ఏడాదిలో కూడా పైనల్కు చేరి రన్నరప్ అయింది. ఐపీఎల్ 2024కి ముందు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ను ముంబయి ఇండియన్స్ కొనుగోలు చేసింది.
దీనితో యాజమాన్యం కెప్టెన్సీ బాధ్యతలను యువ బ్యాటర్ శుభ్మన్ గిల్కి అప్పజెప్పింది. కానీ, కొత్త కెప్టెన్సీలో గుజరాత్ పెద్దగా రాణించలేకపోయింది. మరోవైపు, 2024లో పాయింట్స్ టేబుల్లో ఎనిమిదో స్థానంలో నిలిచి నిరాశ పరిచింది. ఇప్పుడు ఫ్రాంచైజీ ఐపీఎల్ 2025పై దృష్టి పెట్టి… తమ రెండవ టైటిల్ కొట్టాలని కృతనిశ్చయంతో ఉంది.