Ganja

Ganja: అంగట్లో గంజాయి చాక్లెట్లు.. తనిఖీల్లో బట్టబయలు

Ganja: ఇదొక కొత్త రకమైన మోసం. ఆయుర్వేద చాక్లెట్లు అంటూ కవర్‌పై రాసి అమ్మడం ప్రారంభించారు. ఈ చాక్లెట్లు తింటే సకల రోగాలు సర్వ నాశనం అవుతాయని.. రోగ నిరోధక శక్తిలా పనిచేస్తాయని ప్రచారం చేశారు. తీరా చూస్తే అవి గంజాయి చాక్లెట్‌లు. ఈ విషయం తెలియక చాలా మంది. ఒక్కసారి తిన్న వారు మళ్లీ మళ్లీ అవే చాక్లెట్లు కావాలంటూ అడగడం మొదలు పెట్టారు. ఒకసారి తింటే మసనంతా అటే లాగేస్తుండటంతో పదే పదే అవే కావాలంటూ బానిసలయ్యారు.

దీంతో ఈ చాక్లెట్లు ఎందుకు ఇలా అట్రాక్ట్ చేస్తున్నాయి. ఒక్కసారి తిన్నవారు పదే పదే అవే చాక్లెట్లు కావాలని ఎందుకు అడుగుతున్నారు అని ఆరా తీస్తే అవి ఆయుర్వేదంతో చేసిన మందులు కావని.. గంజాయి చాక్లెట్లని గుర్తించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు గంజాయి చాక్లెట్ల గుట్టురట్టు చేశారు.

Ganja: పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండల పరిధిలో ఎక్సైజ్‌ అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ కె.రవీందర్‌ ఆధ్వర్యంలో ఎక్సైజ్‌ సిబ్బంది సోమవారం దాడులు జరిపింది. ఈ దాడుల్లో భారీగా గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 400 గంజాయి చాక్లెట్లు, 170 గ్రాముల ఎండు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఒడిశాలోని పూరి జిల్లాకు చెందిన ఉమాచంద్ ఉపాధి నిమిత్తం ఆంధ్రప్రదేశ్‌కు వచ్చాడు. నాలుగు నెలల క్రితం వచ్చిన అతడు చిలకలూరి పేట – కోటప్పకొండ వెళ్లే దారిలో యూటీ గ్రామానికి వచ్చాడు. అక్కడే ఒక పాన్ దుకాణం పెట్టాడు.

Ganja: ఇక ఎప్పుడుబడితే అప్పుడు తన ఊరికి వెళ్లి తిరిగి వచ్చేటప్పుడు ఆయుర్వేద ఔషధం పేరుతో ‘సెవెన్ మినార్’ అనే గంజాయ్ చాక్లెట్లు తెచ్చి అమ్మేవాడు. ఈ చాక్లెట్లలో దాదాపు 14 గ్రాముల గంజాయి కలుపుతున్నట్లు తేలింది. అయితే ఒక్కో చాక్లెట్‌ను 40 రూపాయలకు అమ్మడంతో మంచి లాభాలు పొందాడు.

దీంతో తన వ్యాపారం మరింత విస్తరించాలని.. చాక్లెట్ ప్యాకెట్లలో 10 గ్రాముల ఎండు గంజాయిని పెట్టి రూ.200లకు అమ్మడం ప్రారంభించాడు. ఇక సమాచారం అందుకున్న పల్నాడు జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారులు దారులు నిర్వహించారు. ఈ దాడుల్లో భారీగా 400 గంజాయి చాక్లెట్లు, 170 గ్రాముల ఎండు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతన్ని అరెస్టు చేశారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *