Punjab: పంజాబ్లోని మొగా జిల్లాకు చెందిన జస్మాయిల్ సింగ్ అనే రోజువారీ కూలీ ఇటీవల పంజాబ్ రాష్ట్ర లాటరీలో రూ. కోటి గెలుచుకుని రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా మారాడు. కేవలం రూ. 6 ఖరీదు చేసే టిక్కెట్తో ఈ భారీ మొత్తాన్ని గెలుచుకోవడం విశేషం. ఫిరోజ్పూర్ జిల్లాలోని జీరాకు వెళ్లినప్పుడు ఈ టిక్కెట్ను కొనుగోలు చేశాడు. ఈ విజయం జస్మాయిల్ సింగ్ జీవితాన్ని మార్చేసిందని చెప్పాలి.
సుమారు రూ. 25 లక్షల అప్పుతో బాధపడుతున్న అతనికి ఈ డబ్బు గొప్ప ఊరటనిచ్చింది. ఈ మొత్తంతో అప్పు తీర్చి, తన ముగ్గురు పిల్లల భవిష్యత్తుపై ఖర్చు చేయాలని ప్లాన్ చేసుకుంటున్నట్లుగా వెల్లడించాడు లాటరీ గెలిచిన వార్త వినగానే జస్మాయిల్ మొదట నమ్మలేకపోయాడు. అతని విజేత టిక్కెట్ నంబర్ 50E42140. ఈ వార్త తెలిసిన అతని గ్రామంలో వెంటనే సంబరాలు అంబరాన్నంటాయి.
Also Read: Amarnath Yatra: భారీ వర్ష సూచన.. అమర్నాథ్ యాత్ర నిలిపివేత
స్థానికులు మిఠాయిలు పంచుకుంటూ, డప్పులు కొట్టుకుంటూ, వీధుల్లో నృత్యం చేస్తూ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ ఘటనతో జస్మాయిల్ సింగ్, ఫిరోజ్పూర్ జిల్లా నుండి రాష్ట్ర లాటరీ ద్వారా కోటీశ్వరుడైన నాలుగో వ్యక్తిగా నిలిచాడు. ఇది నిజంగా అదృష్టం ఒక సామాన్యుడి జీవితాన్ని ఎలా మార్చగలదో చూపించే కథ అనే చెప్పాలి.

