Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివౄఎద్ధి శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం, కుమారవ్వరంలో మినీ గోకులాన్ని ప్రాంభించారు. శ్రీ కౄఎష్ణుడి ఆలయం వద్ద నిర్మించిన ఈ గోకులాన్ని ప్రారంభించి రైతు యాతం నాగేశ్వరరావుకి అందజేశారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ నిధులతో రూ. 1.85 లక్షల వ్యయంతో దీన్ని నిర్మించారు.
మినీ గోకులాన్ని ప్రారంభించి నాలుగు గోవులను రైతుకి అందజేశారు. అదే వేదిక నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిర్మించిన 12,500 మినీ గోకులం షెడ్లను లాంఛనంగా ప్రారంభించారు. అతి తక్కువ సమయంలో భారీ సంఖ్యలో గోకులాల నిర్మాణం పూర్తి చేసి రికార్డు సౄఎష్టించారు. కొబ్బరికాయ కొట్టి శాస్త్రోక్తంగా కుమారపురం మినీ గోకులాన్ని ప్రారంభించిన పవన్ కళ్యాణ్ గోమాతను వూజించి, పశుగ్రాసాన్నిఅందించారు.
ఇది కూడా చదవండి: Dead Body In Fridge: పెళ్లి చేసుకోమన్నందుకు చంపేశాడు.. ఫ్రిడ్జ్ లో పెట్టేశాడు.. పది నెలల తరువాత బయటపడ్డ దారుణం!
Pawan Kalyan: అనంతరం గోకులం నిర్మాణ శైలిని పరిశీలించారు. గోకులం షెడ్లలో ఏర్పాటు చేస్తున్న మౌలిక వసతులను పశుసంవర్ధక శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పాడి రైతులకు అందిస్తున్న సదుపాయాలపై ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను పరిశీలించారు. పశువులకు అందిస్తున్న దాణా, అందుబాటులో ఉన్న పశుగ్రాసం వంగదాలు, పశుగణాభివ. ఎద్ధికి తీసుకుంటున్న చర్యలను ఈ చిత్ర ప్రదర్శన ద్వారా క్షుణంగా అధ్యయనం చేశారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివౄఎద్ధి శాఖ, ఇతర ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఏరావురం నియోజకవర్గం పరిధిలో ఇప్పటి వరకు పూర్తి చేసిన అభివూౄఎద్ధి పనుల వివరాలతో కూడిన పోస్టర్ ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ పంచాయతీరాజ్ గ్రామీణాభివౄ ఎద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, కమిషనర్ శ్రీ కౄఎష్ణ తేజ, జిల్లా కలెక్టర్ షన్మోహన్ సగిలి, ఎస్పీ విశ్రాంత్ పాటిల్, పారసరఫరాల కార్పొరేషన్ ఛైర్మన్ కోట సుధీర్, ఏపీ టిడ్కో ఛైర్మన్ శ్రీ వేములపాటి అజయ కుమార్, కొదా ఛైర్మన్ శ్రీ తుమ్మల రామస్వామి, పిఠాపురం నియోజకవర్గం జనసేన, టీడీపీ, బీజేపీ ఇంఛార్జులు మర్రెడ్డి శ్రీనివాస్, ఎస్వీఎస్ఎన్ వర్మ, కౄ ఎష్ణంరాజు ఇతర ఉన్నతాధికారులు, నాయకులు పాల్గొన్నారు.