Crime News: నేటి సమాజంలో సోషల్ మీడియా మోసాలకు, నమ్మించి మోసం చేసే ఘటనలకు అద్దం పట్టే ఒక షాకింగ్ సంఘటన ఢిల్లీలో వెలుగు చూసింది. దేశ రాజధానిలోని సఫ్తర్జంగ్ ఆస్పత్రిలో పనిచేస్తున్న ఒక లేడీ డాక్టర్ లైంగిక దాడికి గురైనట్లు పోలీసులను ఆశ్రయించడం కలకలం రేపింది.
ఒక డెలివరీ బాయ్ తనను ఆర్మీ లెఫ్ట్నెంట్ అని నమ్మించి మోసం చేసి, లైంగిక దాడికి పాల్పడ్డాడని సదరు డాక్టర్ తన ఫిర్యాదులో పేర్కొంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఘటనలో నిందితుడు డెలివరీ బాయ్గా పనిచేస్తున్న ఆరవ్ అనే వ్యక్తి. ఆరవ్ ఇన్స్టాగ్రామ్లో డాక్టర్కు పరిచయం అయ్యాడు. తాను ఆర్మీలో లెఫ్ట్నెంట్ అధికారిగా పనిచేస్తున్నానని చెప్పి నమ్మించాడు. నకిలీ ఆర్మీ అధికారిగా నమ్మించేందుకు, ఆరవ్ ఆర్మీ యూనిఫాంలో ఫోటోలు దిగి డాక్టర్కు పంపిస్తూ వచ్చాడు. దీంతో ఇద్దరి మధ్య పరిచయం పెరిగి, ఫోన్ నెంబర్లు షేర్ చేసుకుని రెగ్యులర్ కాంటాక్ట్లో ఉండేవారు.
లైంగిక దాడి, ఫిర్యాదు
నకిలీ ఆర్మీ అధికారిగా పూర్తి విశ్వాసం చూరగొన్న తర్వాత ఆరవ్ తన పథకాన్ని అమలు చేశాడు. అక్టోబర్ నెల ప్రారంభంలో ఆరవ్ ఢిల్లీలోని మస్జిద్ మాత్ ప్రాంతంలో ఉన్న ఆ డాక్టర్ ఇంటికి వెళ్లి కలిశాడు. ఇద్దరూ సరదాగా మాట్లాడుకున్న తర్వాత, ఆరవ్ ఆమెకు ఇచ్చిన ఆహారంలో మత్తుమందు కలిపాడు. డాక్టర్ స్పృహ కోల్పోయిన తర్వాత, ఆమెపై ఆరవ్ అత్యాచారానికి పాల్పడ్డాడు. అక్టోబర్ 16న డాక్టర్ స్పృహలోకి వచ్చిన తర్వాత తనపై అఘాయిత్యం జరిగిందని తెలుసుకుని షాక్కు గురైంది. వెంటనే సఫ్దర్జంగ్ ఎన్క్లేవ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
ఇది కూడా చదవండి: Nara Lokesh: మంత్రి లోకేష్ ఫోటోతో భారీ మోసం.. ఇద్దరుని అరెస్ట్ చేసిన సీఐడీ!
పోలీసుల విచారణ, నిందితుడి వాంగ్మూలం
డాక్టర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, చత్తర్పూర్లోని అనేక ప్రాంతాల్లో వెతికి చివరికి నిందితుడైన ఆరవ్ను అరెస్టు చేశారు. విచారణ సందర్భంగా ఆరవ్ చెప్పిన విషయాలు పోలీసులకు మరింత షాక్ ఇచ్చాయి. లేడీ డాక్టర్పై మనసు పడిన ఆరవ్, ఆమెను మోసం చేయడానికి ఉద్దేశపూర్వకంగా ఆర్మీ యూనిఫాం కొన్నట్లు వెల్లడించాడు.
ప్లాన్ ప్రకారం పరిచయం పెంచుకుని, డాక్టర్తో దగ్గరయ్యానని, ఒకరోజు ఇంటికి వెళ్లి ఫుడ్లో మత్తుమందు కలిపి రేప్ చేసినట్లు ఆరవ్ తన నేరాన్ని అంగీకరించాడు. నకిలీ అకౌంట్లు, మోసపూరిత గుర్తింపుల పట్ల సోషల్ మీడియా వినియోగదారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ఈ సందర్భంగా హెచ్చరించారు.

