Sigachi Industry

Sigachi Industry: సిగాచి ఫ్యాక్టరీ ప్రమాదంలో 41కి చేరిన మృతుల సంఖ్య

Sigachi Industry: రంగారెడ్డి జిల్లాలోని పాశమైలారం పారిశ్రామిక వాడలో జరిగిన సిగాచి పరిశ్రమ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఈ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో కార్మికుడు మరణించడంతో, మొత్తం మృతుల సంఖ్య 41కి చేరింది.

ధృవ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహారాష్ట్రకు చెందిన భీమ్‌రావు అనే కార్మికుడు మరణించినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు చాలా మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ఈ ఘటనతో కార్మికుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. పరిశ్రమల భద్రతపై మరోసారి చర్చ మొదలైంది. ప్రభుత్వం ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తోంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Telangana Police: "మందు"బాబులూ పారాహుషార్‌.. దొరికితే భారీ ఫైన్‌, జైలూ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *