Daggubati purandeshwari: తెలంగాణలో ఆయుష్మాన్‌ భారత్‌ అమలైతలేదు..

Daggubati purandeshwari: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి కరీంనగర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె పలు కీలక అంశాలపై మాట్లాడారు. తెలంగాణలో ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని అమలు చేయకపోవడం పేదలు, వృద్ధులపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆమె విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు నష్టమే చేసిందని మండిపడ్డారు.

తెలంగాణలో ఆయుష్మాన్ భారత్‌ను అమలు చేయాలి

కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రవేశపెట్టింది. అయితే, తెలంగాణలో ఈ పథకం అమలులో లేదు. దీని వల్ల లక్షలాది పేదలకు ఉచిత వైద్యం అందకుండా పోతోందని పురంధేశ్వరి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.

బీసీల్లో ముస్లింలను చేర్చడాన్ని ఆలోచించాలి

బీసీల్లో ముస్లింలను చేర్చే అంశంపై ప్రభుత్వం సీరియస్‌గా ఆలోచించాలని పురంధేశ్వరి సూచించారు. ఈ విధానంతో నిజమైన బీసీ లబ్ధిదారులకు నష్టం కలుగుతుందని ఆమె అభిప్రాయపడ్డారు.

ప్రధాని కులంపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అనుచితం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని మోదీ కులాన్ని ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అనుచితమని పురంధేశ్వరి విమర్శించారు. బీసీలను అవమానించేలా రేవంత్ మాట్లాడారని, ఆ వ్యాఖ్యలపై ఆయన వెంటనే స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విమర్శలు

పురంధేశ్వరి మాట్లాడుతూ, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రజలకు నష్టం జరిగిందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. బీజేపీ మాత్రమే ప్రజల సమస్యలను పరిష్కరించగలదని, రాబోయే రోజుల్లో బీజేపీ బలంగా ఎదుగుతుందని ఆమె ధీమావ్యక్తం చేశారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *