crime news

Crime News: అయ్యో పాపం.. నూడుల్స్ కోసం అడిగినందుకు 14 ఏళ్ల పిల్లాడిని చంపేశారు!

Crime News: ఒడిశా రాష్ట్రంలో జరిగిన బాలుడి హత్య తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. చౌ మెయిన్ అనే నూడుల్స్ ఆలస్యంగా డెలివరీ చేయడంపై చెలరేగిన వాదనలో హోటల్ యజమాని బాలుడిని కొట్టి చంపాడని దర్యాప్తులో తేలింది. ఈ సంఘటన ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లాలో జరిగింది. జార్జ్‌పూర్ జిల్లాలోని ఒక దుకాణంలో వినియోగదారుడికి నూడుల్స్ ఆలస్యంగా డెలివరీ చేయడంపై ప్రశ్నించినందుకు.. హోటల్ యజమాని దాడి చేయడంతో  14 ఏళ్ల బాలుడు మరణించాడు.

నూడుల్స్ కోసం గొడవ

Crime News: ఫిబ్రవరి 9, 2025 రాత్రి, గోవింద్‌పూర్ గ్రామ సమీపంలో, సుఖ్‌దేవ్, అతని 14 ఏళ్ల కుమారుడు శంతను దాస్ నూడుల్స్ తినడానికి ఒక దుకాణానికి వచ్చారు. వాళ్ళు అక్కడ నూడుల్స్ ఆర్డర్ చేసారు. కానీ, 30 నిమిషాల తర్వాత కూడా, వారికి నూడుల్స్ వడ్డించలేదు. సుఖ్‌దేవ్ దుకాణం యజమాని మాలిక్‌ను ఆలస్యానికి గల కారణాన్ని అడిగాడు. ఆ సమయంలో ఇద్దరికీ వాదన జరిగింది. ఈ వాదనలో మాలిక్ సుఖ్‌దేవ్ పై దాడి చేశాడు. ఇది చూసిన 14 ఏళ్ల శాంతను దుకాణ యజమాని మాలిక్‌ను తన తండ్రిపై ఎందుకు దాడి చేశావని అడిగాడు. ఆ సమయంలో, మాలిక్, ఇతరులతో కలిసి, ఆ బాలుడిపై ఇనుప రాడ్ తో దాడి చేశారు. 

Crime News: దీంతో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు గాయపడిన తండ్రి, కొడుకు ఇద్దరినీ జాజ్‌పూర్ జిల్లా ప్రధాన కార్యాలయ ఆసుపత్రికి తరలించారు. తరువాత, శాంతను ఆరోగ్యం క్షీణించడంతో కటక్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స ఫలించక మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న హోటల్ యజమాని కమల్ మాలిక్ కోసం వెతుకులాట మొదలు పెట్టారు. ఈ క్రమంలో అతను జాజ్‌పూర్‌లోని ఒక గ్రామంలో దాక్కున్నట్లు వెల్లడైంది.

పోలీసులు ఫిబ్రవరి 19, 2025న అతన్ని కనుగొని అరెస్టు చేశారు. ఆయన బిజెడి నాయకుడు అని చెబుతారు. అతను ఆ ప్రాంతంలో ఒక పెద్ద హోటల్ దుకాణం నడుపుతున్నాడని చెబుతారు. ఆ దుకాణంలోనే అతను ఆ బాలుడిని హత్య చేశాడు. పోలీసులు అతన్ని అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *