Kakinada Child Missing: కాకినాడ జిల్లాలో రెండేళ్ల జ్ఞానేశ్వరి అదృశ్యం కేసు మిస్టరీగా మారింది. తోటలోకి వెళ్లిన పాప కోసం 400 మంది సిబ్బంది, థర్మల్ డ్రోన్లతో 500 ఎకరాల్లో గాలిస్తున్నారు. పాపతో పాటు ఉండి, తిరిగి వచ్చిన పెంపుడు కుక్క కూడా అనుకోకుండా మృతి చెందడం కేసును సందిగ్ధంలో పడేసింది. కుటుంబ కలహాల కోణంలో తండ్రిని విచారిస్తున్న పోలీసులు, జంతువుల దాడి అనుమానంతో స్పై కెమెరాల బొమ్మలను కూడా ఏర్పాటు చేశారు.
మరింత Kakinada Child Missing: 500 ఎకరాలు.. థర్మల్ డ్రోన్లు.. 400 మంది సిబ్బంది! తండ్రి విచారణ.. క్లూ ఇస్తుందనుకున్న పెంపుడు కుక్క మృతి!Category: Crime
crime news in telugu | Andhra Pradesh crime news | Telangana crime news |
Visakhapatnam: గాజువాక రద్దీ మార్కెట్లో పేలిన బాణసంచా దుకాణం..!
విశాఖలోని గాజువాక మార్కెట్ రోడ్డులో ఉన్న ‘శివ ఫైర్వర్క్స్’ బాణసంచా దుకాణంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పటాకులు పేలుతూ visakhapatnam: మంటలు ఎగసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురికాగా, ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను ఆర్పివేశారు. ఈ దుకాణానికి పోలీసుల అనుమతి లేదని, యజమాని కోర్టు ద్వారా పర్మిషన్ తెచ్చుకున్నాడని విశాఖ సౌత్ ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. రద్దీ ప్రాంతంలో ప్రమాదకరంగా వ్యాపారం చేసినందుకు యజమానిపై చర్యలు తీసుకుంటామన్నారు.
మరింత Visakhapatnam: గాజువాక రద్దీ మార్కెట్లో పేలిన బాణసంచా దుకాణం..!Crime News: ప్రేమ వల విసిరి.. పనిమనిషిని గర్భవతిని చేశాడు..!
Crime News: కోస్గి పట్టణంలో బంగారం దుకాణం నడిపే సాయికృష్ణ అనే యువకుడు, తన ఇంట్లో పనిచేసే 20 ఏళ్ల యువతిని ప్రేమ పేరుతో గర్భవతిని చేశాడు. పెళ్లి చేసుకోమని అడిగితే కులం పేరుతో దూషించాడు. రాజకీయ నాయకుల జోక్యంతో మొదట కేసు నమోదు కాకపోయినా, బాధితురాలి పట్టుదలతో ఆదివారం రాత్రి అట్రాసిటీ కేసు నమోదైంది. సోమవారం డీఎస్పీ లింగయ్య ఘటనా స్థలానికి వెళ్లి నిందితుడి ప్రవర్తనపై పూర్తి విచారణ జరిపారు.
మరింత Crime News: ప్రేమ వల విసిరి.. పనిమనిషిని గర్భవతిని చేశాడు..!Crime News: మూడేళ్ల పసికందుపై బిస్కెట్ ఆశ చూపి అఘాయిత్యం.. చికిత్స పొందుతూ చిన్నారి మృతి..!
Crime News: తమిళనాడు తిరువళ్లూర్ జిల్లాలోని సిప్కాట్ పారిశ్రామిక ప్రాంతంలో బీహార్ వలస కూలీల మూడేళ్ల కుమార్తెపై ఓ ఉన్మాది బిస్కెట్ ఆశ చూపి పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టాడు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరిన చిన్నారి ఆదివారం మరణించింది. స్థానికులు నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించగా, పోలీసులు పోక్సో మరియు హత్య కేసు నమోదు చేశారు. సీఎం విజయ్ ‘సింగప్పెణ్’ మహిళా భద్రతా విభాగాన్ని తెచ్చిన కొద్దిరోజులకే ఈ ఘటన జరగడం సంచలనంగా మారింది.
మరింత Crime News: మూడేళ్ల పసికందుపై బిస్కెట్ ఆశ చూపి అఘాయిత్యం.. చికిత్స పొందుతూ చిన్నారి మృతి..!Crime News: పేరుకే లాయర్.. కూతురిని చంపిన కసాయి తల్లి
Crime News: ప్రియుడు మోహన్తో కలిసి జీవించడానికి అడ్డుగా ఉందని ఐదేళ్ల కూతురు వెన్నెలను హత్య చేసిన తల్లి, లాయర్ ప్రియాంకను కాడుగోడి పోలీసులు హాసనలో అరెస్ట్ చేశారు. కోటీశ్వరుడినని నమ్మించిన మోహన్ కోసం ప్రియాంక భర్తను వదిలేసి వచ్చింది. పాప అనారోగ్యంతో చనిపోయిందని అంత్యక్రియలు పూర్తి చేసినా, పోస్ట్మార్టం రిపోర్ట్పై భర్తకు అనుమానం వచ్చి ఫిర్యాదు చేయడంతో హత్య ఉదంతం వెలుగుచూసింది. తీరా చూస్తే ప్రియుడు కోటీశ్వరుడు కాదు, కేవలం అద్దె ఇళ్ల బ్రోకర్ అని తేలింది.
మరింత Crime News: పేరుకే లాయర్.. కూతురిని చంపిన కసాయి తల్లిCrime News: సినిమాని మించిన ప్లాన్.. భార్య హత్యకు సుపారీ ఇచ్చిన భర్త.. కేసు ఛేదించిన కూరగాయల సంచి!
Crime News: ఐడీఏ బొల్లారంలో జరిగిన మీనాదేవి హత్య కేసును పోలీసులు ఛేదించారు. భర్త అనిల్ కుమార్ భార్యను వదిలించుకోవడానికి బీహార్ గ్యాంగ్కు సుపారీ ఇచ్చి చంపించాడు. బండి పాడైందని, గుర్తుతెలియని వ్యక్తులు భార్యను లాకెళ్లి చంపారని భర్త నాటకమాడాడు. అయితే ఘటన స్థలంలో కూరగాయల సంచి కింద పడకుండా పద్ధతిగా పక్కన పెట్టి ఉండటాన్ని గమనించిన పోలీసులు భర్తను విచారించగా అసలు నిజం ఒప్పుకున్నాడు.
మరింత Crime News: సినిమాని మించిన ప్లాన్.. భార్య హత్యకు సుపారీ ఇచ్చిన భర్త.. కేసు ఛేదించిన కూరగాయల సంచి!Crime News: పింఛను డబ్బు కోసం కన్నతండ్రిని ముక్కలుగా నరికిన కేసు.. కొడుకు, కూతురికి ఉరిశిక్ష..!
Crime News: మౌలాలి రైల్వే కాలనీలో 2019లో జరిగిన రిటైర్డ్ ఉద్యోగి మారుతి సుతార్ హత్య కేసులో మల్కాజిగిరి కోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది. రూ. 30 వేల పింఛను కోసం తండ్రిని ఉమ్మెత్త పొడి ఇచ్చి, కత్తులతో నరికి బకెట్లలో దాచిన కొడుకు కిషన్, కూతురు ప్రపుల్లకు ఉరిశిక్ష విధించింది. హత్యకు సహకరించిన భార్య గంగాబాయికి జీవిత ఖైదు విధిస్తూ జడ్జి వి.బాలభాస్కర్రావు తీర్పునిచ్చారు.
మరింత Crime News: పింఛను డబ్బు కోసం కన్నతండ్రిని ముక్కలుగా నరికిన కేసు.. కొడుకు, కూతురికి ఉరిశిక్ష..!Missing Case: మిస్సింగ్ కేసు విషాదాంతం.. బీటెక్ విద్యార్థి ఆత్మహత్య..!
Missing Case: గత నెల 27న టూర్కు వెళ్తానని చెప్పి కాచిగూడలో శబరి ఎక్స్ప్రెస్ ఎక్కి అదృశ్యమైన బీటెక్ విద్యార్థి రాహుల్, ప్రకాశం జిల్లా సింగరాయకొండలో ఒక బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరింత Missing Case: మిస్సింగ్ కేసు విషాదాంతం.. బీటెక్ విద్యార్థి ఆత్మహత్య..!Khammam: కొత్తలంకపల్లి రైల్వే బ్రిడ్జిపై ప్రమాదం.. 26 మందికి
Khammam: ఏలూరు జిల్లా చక్కపల్లి నుండి 36 మంది భక్తులు/ప్రయాణికులతో హైదరాబాద్ వెళ్తున్న కేవీఆర్ ప్రైవేట్ బస్సు ఖమ్మం జిల్లా కొత్తలంకపల్లి రైల్వే బ్రిడ్జిపై డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడింది. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సత్తుపల్లి, పెనుబల్లి ఆసుపత్రులకు తరలించారు. గాయపడిన 12 మందికి ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
మరింత Khammam: కొత్తలంకపల్లి రైల్వే బ్రిడ్జిపై ప్రమాదం.. 26 మందికిDelhi Professor: కోట్ల ఆస్తి కోసం ఢిల్లీ ప్రొఫెసర్ దారుణ హత్య.. మూడో రోజే కేసు ఛేదించిన పోలీసులు!
Delhi Professor: ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ దేవోస్మిత పాల్ హత్య కేసును పోలీసులు మూడు రోజుల్లో ఛేదించారు. బెంగాల్లోని ఆమె కోట్ల విలువైన వారసత్వ ఆస్తిని దక్కించుకోవడానికి, అక్కడ అద్దెకు ఉంటున్న దంపతులే ఈ హత్యకు ఒడిగట్టారు. ముసుగులు ధరించి, బిడ్డతో కలిసి ఢిల్లీలోని ఆమె ఫ్లాట్కు వచ్చి హత్య చేసిన దంపతులను పోలీసులు బెంగాల్లోని బర్ధమాన్లో అరెస్ట్ చేశారు.
మరింత Delhi Professor: కోట్ల ఆస్తి కోసం ఢిల్లీ ప్రొఫెసర్ దారుణ హత్య.. మూడో రోజే కేసు ఛేదించిన పోలీసులు!