మాజీ మంత్రి బీఅర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు బంధువులపై కేసు నమోదైంది.హరీష్రావు తమ్ముడు, మరదలు, మేనమామతో పాటు మరో ముగ్గురు వ్యక్తులు, ఫాస్మో కంపెనీపైనా మియాపూర్ పోలీస్ స్టేషన్లో ట్రెస్పాస్, చీటింగ్ కేసు ఫైల్ అయింది.దండు లచ్చిరాజు అనే వ్యక్తికి సంబంధించిన ఆస్తిని .. ఆయనకు తెలియకుండానే హరీష్ రావు బంధువులు అమ్మేశారని ఫిర్యాదు చేశారు.
లచ్చిరాజు ఇంటిని హరీష్ రావు తమ్ముడు తన్నీరు గౌతమ్, ఇతర బంధువులు బోయినపల్లి వెంకటేశ్వరరావు, గోనెల రాజ్ కుమార్ గౌడ్, గారపాటి నాగ రవి, జంపన ప్రభావతి, తన్నీరు పద్మజారావు ఆక్రమించుకొని అమ్మారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు వ్యతిరేకంగా ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు బాధితుడు. దీంతో కేసు నమోదు చేసుకున్న మియాపూర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.