Delhi: ఈషా ఫౌండేషన్ కు ఊరట.. కేసు కొట్టేసిన సుప్రీం కోర్టు..

ప్రపంచ ప్రఖ్యాతగాంచిన ఈ శాఖ ఫౌండేషన్ పై నమోదైన కేసులు సుప్రీంకోర్టు కొట్టేసింది.త‌న ఇద్దరు కూతుళ్లను స‌ద్గురు బ్రెయిన్‌వాష్ చేశార‌ని, వాళ్లను ఈషా యోగా సెంట‌ర్‌ నుంచి బయటకు రానివ్వడం లేదంటూ ఓ వ్యక్తి ఇటీవలే హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఇవాళ విచారణ జరిపింది.

విచారణలో ఆ ఇద్దరు మహిళలు ఈషా కేంద్రంలో స్వచ్ఛందంగానే ఉంటున్నారని అత్యున్నత న్యాయస్థానానికి పోలీసులు తెలిపారు. ఈ మేరకు వివరాలు సమర్పించారు. పోలీసులు సమర్పించిన వివరాలను పరిశీలించిన న్యాయస్థానం.. ఈ కేసును కొట్టేస్తూ ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెలువరించింది.

ఆధ్యాత్మిక గురువు స‌ద్గురు జ‌గ్జీ వాసుదేవ్ కు చెందిన ఈషా ఫౌండేషన్ తమిళనాడులో ఉంది.కోయంబ‌త్తూరులోని త‌మిళ‌నాడు అగ్రిక‌ల్చర్ యూనివ‌ర్సిటీ ప్రొఫెస‌ర్ ఎస్ కామ‌రాజ్ ఆ కేసు ఫైల్ చేశారు. మొదట మద్రాస్ హైకోర్టులో కేసు నమోదుగా తర్వాత సుప్రీంకోర్టుకు బదిలీ అయింది

మహిళల వాంగ్మూలాన్ని బట్టి వారు స్వచ్ఛందంగా ఆశ్రమంలో ఉండటంపై ఎలాంటి సందేహాలకు తావులేదని పేర్కొంది. ఈ కేసులో తదుపరి చర్యలు తీసుకోకుండా స్టేటస్ రిపోర్టును అత్యున్నత న్యాయస్థానంలో దాఖలు చేయాలని తమిళనాడు పోలీసులను ఆదేశించింది. కేసును కొట్టేస్తున్నట్టు దేశ అత్యున్నత న్యాయస్థానం తెలిపింది.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *