Nara Lokesh: ఏపీ ప్రభుత్వం, ప్రభుత్వం పాఠశాలలను మెరుగుపరిచి, కార్పోరేట్ స్కూళ్లకు సమానంగా తీర్చిదిద్దుతోంది. మరింత ఆధునిక వసతులు, మంచి బోధనతో పిల్లలకు ఉన్నత విద్యనందిస్తోంది. కానీ కొందరు తల్లిదండ్రులు మాత్రం ఇంకా ప్రైవేట్ పాఠశాలలకే మొగ్గుచూపుతున్నారు.
ఈ నేపథ్యంలో.. ప్రభుత్వ ఉపాధ్యాయులే పెద్ద సాహసం చేశారు. తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లో కాదు.. ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించి అందరికీ మంచి ఉదాహరణగా నిలిచారు.
‘‘ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువు మంచిది.. మేము కూడా మా పిల్లలను ఇక్కడే చదిపిస్తున్నాం’’ అని చెప్పి సమాజానికి ఓ సందేశాన్ని ఇచ్చారు.
టీచర్లను అభినందించిన లోకేష్
ఈ విషయాన్ని తెలుసుకున్న విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ వారికి అభినందనలు తెలిపారు.
‘‘మీరు పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదిపించడం నిజంగా ఆదర్శనీయం. మీ పిల్లల ఫలితాలు ప్రభుత్వ విద్యకు బలం ఇస్తున్నాయి’’ అని మంత్రి ప్రశంసించారు.
ఇది కూడా చదవండి: Ramachander Rao: సీఎంకు లేఖతో బీజేపీ రామచందర్రావు పోరు షురూ
పశ్చిమ గోదావరి టీచర్లకు ప్రత్యేక అభినందనలు
పశ్చిమ గోదావరి జిల్లా టీచర్లు ప్రత్యేక గుర్తింపు పొందారు.
-
జిన్నూరు జడ్పీ పాఠశాల స్కూల్ అసిస్టెంట్ బొంతు మధుబాబు
-
పంగిడిగూడెం ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు బాబూ రాజేంద్రప్రసాద్
-
సోమరాజుచెరువు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు వీరవాసరపు బాలకరుణాకరరావు
ఈ ముగ్గురూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదిపిస్తూ మిగిలినవారికి స్ఫూర్తిగా నిలిచారు.
మా’స్టార్స్’.. నిజమైన బ్రాండ్ అంబాసిడర్లు!
ఈ టీచర్లను మంత్రి లోకేష్ ‘‘ప్రభుత్వ విద్యకు బ్రాండ్ అంబాసిడర్స్.. మా’స్టార్స్’.. మీకు హ్యాట్సాఫ్!’’ అంటూ గౌరవించారు.
సాధన వల్లే ప్రభుత్వ పాఠశాలలు ముందుకు పోతున్నాయనే మాట నిజమే!
ప్రభుత్వ విద్యకు బ్రాండ్ అంబాసిడర్స్ ..మా’స్టార్స్’
మీకు హ్యాట్సాఫ్ఈ మేస్టారులు.. మా’స్టార్స్’.. ప్రభుత్వ విద్యకు బ్రాండ్ అంబాసిడర్స్.. మీకు హ్యాట్సాఫ్. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల్ని చేర్పించాలని కోరే మీరు, మీ పిల్లల్ని కూడా అదే పాఠశాలల్లో చేర్పించడం ఆదర్శనీయం. ప్రభుత్వ…
— Lokesh Nara (@naralokesh) July 5, 2025