AP Cabinet Meeting: ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు జరగాల్సిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం (క్యాబినెట్ భేటీ) రేపటికి వాయిదా పడింది.
రేపు మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం
వాయిదా పడిన క్యాబినెట్ సమావేశం రేపు (సెప్టెంబర్ 19, శుక్రవారం) మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహిస్తారు. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.