Ambati Rambabu: హోంమంత్రి అనిత తన పరిధి దాటి మాట్లాడుతున్నారని, పదవి నుంచి తప్పిస్తారనే భయంతోనే ఆమె అలా వ్యవహరిస్తున్నారని వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తమ నేతలపై అన్యాయంగా కేసులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు.
నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై దాడి ఖండనీయం:
నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటికెళ్లి పోలీసులు దాడులు చేయడం దారుణమని అంబటి రాంబాబు అన్నారు. ఇటువంటి చర్యలు ప్రజాస్వామ్యానికి మంచివి కావని ఆయన స్పష్టం చేశారు.
జగన్ ప్రజాదరణ చూసి ఓర్వలేకపోతున్నారు:
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ప్రభుత్వం ఓర్వలేకపోతుందని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. “జగన్ పిలవకపోయినా ప్రజలు స్వచ్ఛందంగా వస్తారు. ఆయన పర్యటనలకు ప్రజలు రాకుండా చేయాలని కుట్రలు పన్నుతున్నారు. ప్రజల్ని అడ్డుకోవడానికి పోలీసుల్ని వాడుకోవడం సిగ్గుచేటు” అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.