Amaravati: ఏపీలో 32 మంది కలెక్టర్లు బదిలీ

Amaravati:ఏపీలో భారీగా కలెక్టర్ల బదిలీ చేపట్టింది ప్రభుత్వం. ఒకేసారి 32 మంది డిప్యూటీ క‌లెక్ట‌ర్ల‌ను బ‌దిలీ చేసింది.ఈ మేర‌కు రాష్ట్ర‌ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నీర‌బ్ కుమార్ ప్ర‌సాద్ ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఇక బ‌దిలీల‌లో భాగంగా ఏడుగురు డిప్యూటీ క‌లెక్ట‌ర్ల‌కు ఏపీ సీఆర్‌డీఏలో పోస్టింగ్‌లు ఇచ్చారు.

ప్రోటోకాల్ డైరెక్ట‌ర్‌గా టి.మోహ‌న్ రావు,ఏపీ శిల్పారామం సొసైటీ సీఈఓగా వి.స్వామినాయుడు, ఏపీఐఐసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్‌గా పి.ర‌చ‌న‌,సీసీఎల్ఏ స‌హాయ కార్య‌ద‌ర్శిగా డి.ల‌క్ష్మారెడ్డి, శ్రీకాళహస్తి ఆల‌యం ఈఓగా టి. బాపిరెడ్డిని నియ‌మిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేశారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Ap news: విశాఖలో మోదీ పర్యటన.. షెడ్యూల్ ఇదే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *