Crime News: వాడికే బ్రతికే దిక్కు లేదు. అలాంటిది …నీకు ఒక లైఫ్ ఇస్తా అని ఓ బాలికకు మాయ మాటలు చెప్పాడు. నమ్మింది. ఆ చిన్న మనసుకు…వాడి మాటలే..సర్వస్వము అనుకుని …వెళ్ళింది. కొన్ని రోజులు అంతా బాగానే ఉంది. కానీ …వాటిలోని నిజ స్వరూపం బయటకు వచ్చిదని. అంతే …వేళ్ళు ..వెళ్లి డబ్బు తీసుకురా అని టార్చర్ పెట్టాడు. ఎలా ఏ ముఖం పెట్టుకుని కన్న వారి వద్దకు వెళ్తుంది ..అలా వేళ్ళ లేక ఇలా చనిపోయింది
ప్రేమించిన యువకుడి వేధింపులు తాళలేక బాలిక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండల కేంద్రంలో వెలుగులోకి వచ్చింది. ఏపీలోని విజయవాడకు చెందిన బాలిక ఇంటర్మీడియట్ ఫస్టియర్ చదువుతోంది. ఆమెకు సోషల్ మీడియా ద్వారా మోత్కూరుకు చెందిన కందుకూరి మున్నాతో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది.
డిసెంబర్ 30వ తేదీన కాలేజీకి వెళ్తున్నానని తల్లిదండ్రులకు చెప్పి మెత్కూరుకు చేరుకుంది. అప్పటి నుంచి ఓ ఇంటిని అద్దెకు తీసుకొని సదరు బాలిక, మున్నా సహజీవనం చేస్తున్నారు. బాలిక ఫోన్లో తన తల్లితో అప్పుడప్పుడు మాట్లాడుతూ.. తాను బాగానే ఉన్నానని, తాను మున్నా అనే యువకుడిని ప్రేమిస్తున్నానని, అతడిని వివాహం చేసుకునేందుకు వచ్చానని తెలియజేసింది.కానీ తాను ఉంటున్న చిరునామాను మాత్రం తల్లిదండ్రులకు వెల్లడించలేదు.
Also Read: Crime News: గంజాయి మత్తులో ఘాతుకం!
సదరు బాలిక మరోసారి తన తల్లికి వీడియో కాల్ చేసి 15 వేల రూపాయలు కావాలని ఏడుస్తూ అడిగింది. ఎందుకమ్మా అని కూతురుని తల్లి ప్రశ్నించగా.. మీ అమ్మ దగ్గర డబ్బులు తీసుకురావాలని మున్నా వేధిస్తున్నారని, తను కొట్టాడని తల్లికి వివరించింది. ఈ క్రమంలో తాము అద్దెకు ఉంటున్న ఇంట్లో సీలింగ్ ఫ్యాన్కు చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తనను మున్నా వేధిస్తున్న విషయాలన్నీ బాలిక సూసైడ్ నోట్లో పేర్కొంది.
మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నాగరాజు తెలిపారు. మున్నా అనే యువకుడు తన కుమారైను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించాడని, ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బుల కోసం తీవ్రంగా కొట్టి అఘాయిత్యానికి పాల్పడ్డాడని బాలిక తల్లిదండ్రులు ఆరోపించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టుం నిమిత్తం రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి పోలీసులు తరలించారు.