Amit Shah

Amit Shah: సెలవుల్లో ఉన్న సిబ్బందిని వెనక్కి రప్పించండి

Amit Shah: ఇటీవల పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి భారత భద్రతా బలగాలు గట్టి ప్రతిస్పందన ఇచ్చాయి. ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో చేపట్టిన ఈ ప్రతీకార దాడిలో భారత ఆర్మీ తొమ్మిది పాక్ ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసింది. ఈ ఆపరేషన్ తర్వాత కూడా పాక్ రేంజర్లు నియంత్రణ రేఖ వద్ద విచక్షణలేని కాల్పులకు పాల్పడుతుండటంతో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.

ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక నిర్ణయం తీసుకున్నారు. సెలవుల్లో ఉన్న పారా మిలిటరీ సిబ్బందిని వెంటనే విధుల్లోకి రప్పించాలని బీఎస్ఎఫ్‌, సీఆర్పీఎఫ్‌, ఐటీబీపీ అధిపతులకు ఫోన్ చేసి ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు.

గత నెలలో పహల్గాంలో విహారయాత్రకు వచ్చిన పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించగా, వెంటనే భారత్ అన్ని వేదికలపై పాకిస్థాన్‌పై ఒత్తిడి పెంచడం ప్రారంభించింది.

ఇది కూడా చదవండి: Karregutta: కర్రెగుట్టలో భారీ ఎన్‌కౌంటర్‌.. 22 మంది మావోయిస్టులు మృతి

ఇప్పుడు ఉగ్ర స్థావరాలపై భారత ఆర్మీ దాడులు జరపడంతో ప్రజల్లో గర్వం, విశ్వాసం వెల్లివిరుస్తోంది. ఉగ్రవాదానికి తగిన గుణపాఠం చెప్పారని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం, భద్రతా బలగాలపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

సామాజిక మాధ్యమ వేదికగా స్పందించిన అమిత్ షా, “పహల్గాం హత్యాకాండకు ఇదే సమాధానం. ఆపరేషన్ సిందూర్ ద్వారా మనం ఉగ్రవాదానికి గట్టి ఝలక్ ఇచ్చాం. ఉగ్ర మూలాలను కూల్చేయడం వరకే ఇది ఆగదు” అని హెచ్చరించారు.

ఈ క్రమంలో భారత్ చేపట్టిన మెరుపు దాడులు అంతర్జాతీయంగా సైతం చర్చకు దారి తీశాయి. పాక్ మౌలిక మద్దతుతో నడుస్తున్న ఉగ్రవాదానికి ఇక భారత్ సహనాన్ని చూపించదన్న సంకేతం ఇది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *