Delhi Pollution: ఢిల్లీలో కాలుష్యాన్ని నియంత్రించడానికి, కృత్రిమ వర్షాన్ని కురిపించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అయితే, ఈ ప్రక్రియలో ఉపయోగించే రసాయనాలు మానవ శరీరానికి ఏదైనా హాని కలిగిస్తాయా అనే దానిపై కూడా వారు దర్యాప్తు చేస్తున్నారు. రాబోయే నీటి నమూనా పరీక్షల ఫలితాల్ని బట్టి , కృత్రిమ వర్షం కురిపించే ప్రయత్నాలను ఢిల్లీ ప్రభుత్వం నిర్వహించాలని యోచిస్తోందని పర్యావరణ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా అన్నారు.
కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని, కృత్రిమ వర్షాన్ని సృష్టించే ప్రణాళికను ఢిల్లీ ప్రభుత్వం పరిశీలిస్తోందని, ఈ విషయంలో అధ్యయనం జరుగుతోందని కూడా ఆయన అన్నారు. ఢిల్లీలో కాలుష్యాన్ని నియంత్రించడానికి కృత్రిమ వర్షాలు కురిపించే ప్రణాళికలు ఉన్నాయి. అయితే, ఈ ప్రక్రియలో ఉపయోగించే రసాయనాలు మానవ శరీరానికి ఏదైనా హాని కలిగిస్తాయా అనే దానిపై కూడా ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.
కృత్రిమ వర్షం..
ఢిల్లీలో PTI కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పర్యావరణ మంత్రి మంజీందర్ సింగ్ సిర్సా మాట్లాడుతూ, “కృత్రిమ వర్షం కురిపించే ప్రాజెక్టును ప్రభుత్వం పరిశీలిస్తోంది. దీనిపై అధ్యయనం జరుగుతోంది. కృత్రిమ వర్షానికి ఉపయోగించే రసాయనాలు మానవ శరీరానికి లేదా చర్మానికి ఏదైనా హాని కలిగిస్తాయా లేదా అని తెలుసుకోవడానికి దీనిపై వివరణాత్మక నివేదికను కోరాము” అని అన్నారు.
ఈ నివేదిక ఆధారంగా, ఢిల్లీ వెలుపలి ప్రాంతాలలో చిన్న తరహా కృత్రిమ వర్షపాతాన్ని పరీక్షిస్తాము. ఎటువంటి ప్రతికూల ప్రభావాలు లేవని నిర్ధారించుకోవడానికి మేము నీటి నమూనాలను కూడా విశ్లేషిస్తాము. పరీక్షలు విజయవంతమై, నమూనాలు ఎటువంటి దుష్ప్రభావాలను చూపించకపోతే, ప్రాజెక్ట్ను కొనసాగిస్తామని మంత్రి స్పష్టం చేశారు.
గాలి నాణ్యత..
స్మోక్ టవర్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ, సిర్సా అది విఫలమైందని అన్నారు. “ఢిల్లీ-ఎన్సిఆర్లో గణనీయమైన మార్పులు తీసుకురావడానికి బిజెపి ప్రభుత్వం త్వరలో కొత్త బహుళ-రంగాల ప్రణాళికను ప్రకటిస్తుంది. కాలుష్య వనరులను నేరుగా లక్ష్యంగా చేసుకుని, వాటిని తొలగించడం లేదా తగ్గించడంపై మా దృష్టి ఉంటుంది. దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత శీతాకాలంలో గణనీయంగా క్షీణిస్తుంది. గాలి నాణ్యత సూచిక తరచుగా 450 దాటుతుంది. ఇది భారతదేశంలోనే అత్యంత చెత్తది.” అని ఆయన చెప్పారు.
Also Read: Telangana News: ఉగాది పర్వదినాన సన్న బియ్యం పంపిణీ షురూ.. ఆ ఊరిలోనే సీఎం లాంఛన ప్రారంభం
Delhi Pollution: వాయు కాలుష్యాన్ని నియంత్రించడంలో సహాయపడటానికి, అన్ని ఎత్తైన భవనాలు, హోటళ్ళు, షాపింగ్ మాల్స్, విమానాశ్రయాలు, ప్రధాన నిర్మాణ ప్రదేశాలలో స్మోక్ రెసిస్టెన్స్ పైపులను ఏర్పాటు చేయాలి. దీనికోసం అలంటి ఏర్పాటు చేయడానికి ఎన్ని భవనాలు ప్రస్తుతం ఉన్నాయి? ఎన్ని నిర్మాణ దశలో ఉన్నాయి తదితర పూర్తి వివరాలతో నివేదికను రూపొందించాలని ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD)ని ఆదేశించారు.
నివేదిక సిద్ధమైన తర్వాత, మేము అమలు చర్యలతో ముందుకు వెళ్తాము. “కాలుష్యానికి కీలక పాత్ర పోషించేవారిని జవాబుదారీగా ఉంచడం.. శుభ్రపరిచే ప్రయత్నాలలో వారి చురుకైన భాగస్వామ్యాన్ని నిర్ధారించడం లక్ష్యం” అని ఈ సందర్భంగా మంత్రి చెప్పారు.