Siddipet

Siddipet: భార్య,ఇద్దరు పిల్లలతో కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం

Siddipet: సిద్దిపేట జిల్లాలోని కలకుంట కాలనీలో విషాదం నెలకొంది. ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న పండరి బాలకృష్ణ కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డారు. భార్యా పిల్లలకు విషమిచ్చి.. కానిస్టేబుల్ పండరి బాలకృష్ణ ఉరి వేసుకున్నాడు. కానిస్టేబుల్ మృతి చెందగా.. ఆయన భార్యా పిల్లలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Siddipet: సిరిసిల్ల 17వ బెటాలియన్‌కు చెందిన పండరి బాలకృష్ణకు భార్య ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. కుటుంబంతో సహా పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. పురుగుల మందు తాగి తర్వాత ఉరివేసుకున్న బాలకృష్ణ మృతి చెందాడు. ఇది గమనించిన స్థానికులు స్పృహతప్పిపోయిన కానిస్టేబుల్ భార్యా పిల్లలను హుటాహటిన సిద్ధిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఇది కూడా చదవండి: Heroines: పారితోషికంలో వీరే టాప్ హీరోయిన్స్!

Siddipet: కానిస్టేబుల్ బాలకృష్ణ పిల్లలు యశ్వంత్, ఆశ్రిత్. కాగా భార్యా, పిల్లలు సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు చెప్పారు. ఈ ఘటనపై వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

అయితే బాలకృష్ణ వృత్తి రీత్యా సిరిసిల్లలో పని చేస్తున్నప్పటికీ, సిద్ధిపేటలో నివాసం ఉంటున్నారు. కానిస్టేబుల్ కుటుంబంతో ఆత్మహత్యాయత్నానికి ఆర్ధిక ఇబ్బందులే కారణమని. అతని భార్య, పిల్లలు స్పృహలోకి వచ్చి చెబితే వివరాలు తెలిసే అవకాశముంది. ప్రధానంగా ఆర్థిక ఇబ్బందులే కారణంగా ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *