Vidadala Rajini: ఏపీ మాజీ మంత్రి విడదల రజిని మరిది గోపిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్లో ఆయన్ను అరెస్ట్ చేసి విజయవాడకు తరలిస్తున్నారు. యడ్లపాడులో కంకర క్వారీ యజమానులను బెదిరించి డబ్బు వసూలు చేశారని గోపితో పాటు విడదల రజినిపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలోనే గోపిని అరెస్ట్ చేశారు.