India-Pakistan Match

India-Pakistan Match: ఇండియా-పాకిస్తాన్ మళ్లీ మ్యాచ్ ఎప్పుడంటే?

India-Pakistan Match: పహల్గామ్ దాడి, ఆపరేషన్ సిందూర్‌ తరువాత ఇండియా, పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఎఫెక్ట్ క్రికెట్ పైన కూడా పడింది. దీంతో ఈ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ ఎప్పుడు ఉంటుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. మీడియా నివేదికల ప్రకారం సెప్టెంబర్‌లో జరగనున్న ఆసియా కప్‌లో టీం ఇండియా పాకిస్తాన్‌తో తలపడనుంది.

ఆసియా కప్ టోర్నమెంట్ సెప్టెంబర్ మొదటి వారం నుండి జరిగే అవకాశం ఉందని సమాచారం. ఆసియా కప్ సెప్టెంబర్ 5 నుండి ప్రారంభమై UAEలో జరుగుతుంది. ఆతిథ్య జట్ల హక్కులను BCCI రిజర్వ్ చేసుకుంది. భారతదేశం, పాకిస్తాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ UAE జట్లు ఈ టోర్నమెంట్‌లో పాల్గొంటాయని, ఇది 17 రోజుల పాటు జరుగుతుంది.

ఇది కూడా చదవండి: Mohammed Shami: మొహమ్మద్ షమీకి పెద్ద షాక్… హైకోర్టులో ఎదురుదెబ్బ

ప్రారంభ షెడ్యూల్ ప్రకారం, సెప్టెంబర్ 7న భారత్, పాకిస్తాన్ తలపడతాయి. ఇప్పటివరకు జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, అన్ని జట్లు టోర్నమెంట్‌లో పాల్గొనడానికి వారి వారి ప్రభుత్వాల నుండి అనుమతి పొందే ప్రక్రియలో ఉన్నాయి. 2025 ఆసియా కప్ సెప్టెంబర్ 5 (శుక్రవారం)న ప్రారంభమయ్యే అవకాశం ఉంది. భారత్, పాకిస్తాన్ మధ్య గ్రూప్ దశ మ్యాచ్ సెప్టెంబర్ 7 (ఆదివారం)న జరిగే అవకాశం ఉంది. T20 ఫార్మాట్‌లో జరిగే ఈ టోర్నమెంట్, 2022 2023లో జరిగిన మునుపటి రెండు ఎడిషన్‌ల మాదిరిగానే గ్రూప్ దశ , సూపర్-4 ఫార్మాట్‌లో జరుగుతుంది.

పాకిస్తాన్, భారత్ సూపర్ 4 కి అర్హత సాధిస్తే, వారు సెప్టెంబర్ 14 (ఆదివారం)న రెండోసారి ఒకరినొకరు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఫైనల్ సెప్టెంబర్ 21 (ఆదివారం)న జరిగే అవకాశం ఉంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *