Viral News: రోడ్డు భద్రతను పూర్తిగా విస్మరిస్తూ, తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రమాదకర విన్యాసాలు చేసిన ఎనిమిది మంది యువకుల నిర్లక్ష్యం రంగారెడ్డి జిల్లాలో వెలుగు చూసింది. రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గగన్పహాడ్ వద్ద ఈ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.
సాధారణంగా ఇద్దరు వ్యక్తులు ప్రయాణించడానికి రూపొందించిన ఒకే ద్విచక్ర వాహనంపై ఏకంగా ఎనిమిది మంది యువకులు ప్రయాణించారు. అంతేకాకుండా, వారు అత్యంత ప్రమాదకర రీతిలో స్టంట్లు చేస్తూ రోడ్డుపై స్వైరవిహారం చేశారు. బైక్ వెనుక కూర్చున్న వారు ఒకరిపై ఒకరు పేర్చినట్లు కూర్చుని, అటూ ఇటూ ఊగుతూ విన్యాసాలు చేశారు. ఇది చూసిన ఇతర వాహనదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో, రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు వెంటనే స్పందించారు. రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేందర్ గౌడ్ ఆదేశాల మేరకు పోలీసులు త్వరితగతిన చర్యలు తీసుకున్నారు. వీడియో ఆధారంగా యువకులను గుర్తించి, వారిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఎనిమిది మంది యువకులను అరెస్టు చేసి పోలీసులకు అప్పగించారు. రాజేంద్రనగర్ ట్రాఫిక్ సీఐ రాజేంద్ర గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం, పట్టుబడిన యువకులలో కొందరు మైనర్లు కూడా ఉన్నారు.
Also Read: Jahnavi Dangeti: తెలుగు కీర్తి ప్రతిష్టలు: పాలకొల్లు అమ్మాయి జాహ్నవి అంతరిక్షయానం!
Viral News: ఇలాంటి ప్రమాదకర స్టంట్లు, నిబంధనలకు విరుద్ధంగా ఒకే బైక్పై ఎక్కువ మంది ప్రయాణించడం వల్ల తీవ్ర ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కేవలం తమ ప్రాణాలకే కాకుండా, రోడ్డుపై ప్రయాణించే ఇతర వాహనదారుల ప్రాణాలకు కూడా వీరు ముప్పు తెచ్చినట్లవుతుంది. పోలీసులు కేసు నమోదు చేసి, చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మైనర్లు ఉన్నందున వారి తల్లిదండ్రులకు కూడా కౌన్సిలింగ్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా యువత, వారి తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
ఒకే బైక్ పై 8 మంది ప్రయాణిస్తూ స్టంట్స్
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ పరిధిలో గగన్ పహాడ్ వద్ద ఒకే ద్విచక్ర వాహనంపై ఎనిమిది మంది యువకులు ప్రమాదకర రీతిగా ప్రయాణిస్తూ స్టంట్లు చేశారు
ఈ విషయాన్ని గమనించిన కొందరు వాహనదారులు వీడియో తీసి ట్విట్టర్… pic.twitter.com/xAqi9VmOJv
— TNews Telugu (@TNewsTelugu) June 23, 2025

