Vijayawada: 50 లక్షల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టు పడ్డ ఈఎన్సీ..

Vijayawada: విజయవాడలో భారీ లంచం వ్యవహారంలో ట్రైబల్ వెల్ఫేర్ విభాగానికి చెందిన చీఫ్ ఇంజినీర్ (ఈఎన్సీ) శ్రీనివాస్‌ ఏసీబీకి చిక్కారు. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్ల అభివృద్ధి పనుల బిల్లుల క్లియరెన్సు కోసం రూ.50 లక్షల లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.

ఈ డిమాండ్‌లో భాగంగా శ్రీనివాస్‌ నుంచి రూ.25 లక్షలు స్వీకరిస్తుండగా, ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన అధికారులు చేపట్టిన స్టింగ్ ఆపరేషన్‌లో వెలుగు చూసింది. మిగతా వివరాలను ఏసీబీ త్వరలో అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *