supreme court

Supreme Court: అత్యాచార కేసుల్లో నిందితులను నపుంసకులను చేయాలి.. సుప్రీంకోర్టులో డిమాండ్

Supreme Court: నిర్భయ గ్యాంగ్‌రేప్-హత్య జరిగి 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇందులో అత్యాచార నిందితులను నపుంసకులుగా మార్చాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా, మహిళల భద్రతపై మార్గదర్శకాలు రూపొందించడం, చట్టాలను మెరుగుపరచడం సహా 20 డిమాండ్లు ఈ పిటిషన్ లో చేశారు. 

జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్వల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం పిటిషన్‌ను స్వీకరిస్తూ – ఈ డిమాండ్ చాలా క్రూరమైనది అని వ్యాఖ్యానించింది. ఈ పిటిషన్‌పై న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు,విభాగాలకు నోటీసులు జారీ చేసింది. వారి ప్రతిస్పందనను కోరింది.

ఇది కూడా చదవండి: Yogi Adityanath: సంభాల్ అల్లర్లపై సీఎం యోగి సెన్సేషనల్ కామెంట్స్

Supreme Court: ప్రభుత్వ భవనాలు, ప్రదేశాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, ఆన్‌లైన్‌లో అశ్లీల, OTT అసభ్యకర కంటెంట్‌ను నిషేధించాలని మహిళా న్యాయవాదుల సంస్థ సుప్రీంకోర్టు మహిళా న్యాయవాదుల సంఘం SCWLA పిటిషన్‌లో డిమాండ్ చేసింది.

SCWLA అధ్యక్షురాలు, సీనియర్ న్యాయవాది మహాలక్ష్మి పావని మాట్లాడుతూ నిర్భయ నుండి అభయ – కోల్‌కతా  RG కర్ రేప్-హత్య బాధితురాలు వరకు ఏమీ మారలేదు. రోడ్డు నుంచి ఇంటి వరకు మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. నిర్భయ కేసు తర్వాత చట్టాలను కఠినతరం చేసినా అమలుకు నోచుకోలేదు. అత్యాచారం కేసులో మీడియా విచారణ జరిగే వరకు దేశం మేల్కోదు అంటూ వ్యాఖ్యానించారు. 

Supreme Court: నేషనల్ సెక్స్ అఫెండర్స్ రిజిస్ట్రీ వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ను రూపొందించాలని ఆమె డిమాండ్ చేశారు. అత్యాచారానికి పాల్పడే నేరస్థుల డేటాను అందులో ఉంచాలి, దీనిని మహిళలందరూ తెలుసుకోగలుగుతారు. రష్యా, పోలాండ్, దక్షిణ కొరియా, పాకిస్థాన్, ఇండోనేషియా, టర్కీ, 8 US రాష్ట్రాలతో సహా అనేక దేశాలు లైంగిక నేరాలకు కాస్ట్రేషన్, స్టెరిలైజేషన్ అవసరమయ్యే చట్టాలను రూపొందించాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Dk shivakumar : ఆర్ఎస్ఎస్ ప్రార్థన పాడిన డీకే శివకుమార్ – అసెంబ్లీలో కలకలం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *