Telangana Cabinet

Telangana Cabinet: తెలంగాణ మంత్రి వర్గ విస్తరణకు రంగం సిద్ధం

Telangana Cabinet: తెలంగాణలో కొత్త మంత్రుల ఎంపికపై నెలలుగా కొనసాగిన ఉత్కంఠకు తుదిమెరుగుపడింది. రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో, రేపు (జూన్ 8, ఆదివారం) నూతన మంత్రుల ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణ కేబినెట్‌లో 12 మంది మంత్రులు ఉన్నప్పటికీ, మరో ఆరు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. మొదటగా ముగ్గురు లేదా నలుగురు కొత్త నాయకులు మంత్రివర్గంలో చేరే అవకాశం ఉందని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన ఈ సాయంత్రం రాజ్‌భవన్‌ నుంచి వెలువడే సూచనలు ఉన్నాయి.

ఈ విస్తరణ కోసం పలువురు కాంగ్రెస్ నేతలు ఢిల్లీ చుట్టూ తిరుగుతూ తమకు అవకాశం ఇవ్వాలని హైకమాండ్‌ను వినతులు చేస్తున్నారు. ముఖ్యంగా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు, వర్గపరంగా వెనుకబడిన సామాజిక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు మంత్రి పదవుల కోసం పోటీ పడుతున్నారు. కేబినెట్‌లో ఎస్సీ, బీసీ, మైనారిటీ వర్గాలకు తగిన ప్రాతినిథ్యం కల్పించాలని రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఎస్సీ, మైనారిటీ వర్గాలకు తగిన స్థానం లభించకపోవడంతో, ఈ విస్తరణలో వారికి అవకాశం కల్పించే అవకాశం ఉందని సమాచారం. ముదిరాజ్, మాదిగ సామాజికవర్గాలకు చెందిన ఎమ్మెల్యేల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read: Rekha Gupta: ఢిల్లీ సీఎం రేఖా గుప్తాను చంపేస్తానని బెదిరించిన వ్యక్తి అరెస్ట్

Telangana Cabinet: వివేక్ వెంకటస్వామి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, విజయశాంతి, వాకిటి శ్రీహరి, మదన్ మోహన్ రావు, ప్రేమ్‌సాగర్ రావు, శంకర్ నాయక్ వంటి నేతలు మంత్రి పదవుల కోసం పోటీలో ఉన్నారు. బీసీ కోటాలో బీర్ల ఐలయ్య, ఎస్టీ కోటాలో శంకర్ నాయక్ పేర్లు వినిపిస్తున్నాయి. రంగారెడ్డి జిల్లాకు మంత్రివర్గంలో చోటు ఇవ్వాలని అక్కడి నేతలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. అనేక వర్గాలకు చెందిన నేతలు మంత్రి పదవుల కోసం పోటీ పడుతున్న నేపథ్యంలో, కాంగ్రెస్ నాయకత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఆశావాహులంతా అసంతృప్తిగా మిగలకుండా మరిన్ని స్థానాలను భవిష్యత్తులో భర్తీ చేయడానికై ఖాళీగా ఉంచే అవకాశమున్నది.

ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్‌గా బాధ్యతలు స్వీకరించిన మీనాక్షి నటరాజన్, రాష్ట్ర నేతల అభిప్రాయాలను సేకరించి హైకమాండ్‌కు నివేదిక ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ నివేదిక ఆధారంగా కేబినెట్ విస్తరణపై నిర్ణయం తీసుకున్న హైకమాండ్, సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌తో మంతనాలు పూర్తి చేసినట్లు సమాచారం. రేపటి ప్రమాణస్వీకారానికి అవసరమైన ఏర్పాట్లు ఇప్పటికే రాజ్‌భవన్ వద్ద మొదలయ్యాయి. అధికారిక ప్రకటనతో పాటు, ఎవరెవరు మంత్రులుగా ప్రమాణం చేస్తారన్న ఉత్కంఠకు కూడా రేపు తెర పడనుంది. తాజా పరిస్థితుల్లో చూస్తే, రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ మంత్రివర్గానికి త్వరలోనే కొత్త శక్తి, సామాజిక సమీకరణాల్లో సమతుల్యత ఏర్పడనుంది.

ALSO READ  Cm revanth: ఎస్ఎల్బీసీ టన్నల్ వద్ద సీఎం రేవంత్

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *