NEET-UG Retest

NEET-UG Retest: శంకర్ దాదా MBBS స్టైల్‌లో చీటింగ్.. దొరికిపోయిన 24 మంది..!

NEET-UG Retest: బీహార్‌ లఖిసరాయ్‌లో నీట్-యూజీ రీ-టెస్ట్ సందర్భంగా మరొకరి స్థానంలో పరీక్షలు రాసే ‘సాల్వర్ గ్యాంగ్’ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఎయిమ్స్, బీహెచ్‌యూ, పీఎమ్‌సీహెచ్ మెడికల్ మరియు నర్సింగ్ విద్యార్థులతో పాటు బయోమెట్రిక్ కంపెనీ సిబ్బంది కలిపి మొత్తం 24 మందిని అరెస్ట్ చేశారు. పాత నీట్ కేసు నిందితుడు అర్పిత్ రాజ్ దీనికి మాస్టర్‌మైండ్‌గా తేలాడు. అనారోగ్యం నెపంతో కాలేజీ నుండి తప్పించుకుని మయాంక్ కశ్యప్ అనే ఎంబీబీఎస్ స్టూడెంట్ నకిలీ బయోమెట్రిక్ ఆఫీసర్‌గా వచ్చి పట్టుబడటంతో ఈ స్కామ్ బయటపడింది.

మరింత NEET-UG Retest: శంకర్ దాదా MBBS స్టైల్‌లో చీటింగ్.. దొరికిపోయిన 24 మంది..!
IUML:

IUML: డీఎంకేకు 60 ఏళ్ల మిత్రపక్షం ‘ఐయూఎంఎల్’ గుడ్ బై.. విజయ్ ‘టీవీకే’ గూటికి ముస్లిం లీగ్!

IUML: తమిళనాడు రాజకీయాల్లో 1962 నుండి డీఎంకే కూటమిలో ఉన్న ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) ఆ కూటమికి గుడ్ బై చెప్పి, నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకేతో చేతులు కలిపింది. డీఎంకే స్థానిక నేతల పెత్తనం, సీట్ల కేటాయింపులో అసంతృప్తి దీనికి కారణం కాగా.. ఐయూఎంఎల్ ఎమ్మెల్యే ఏ.ఎం. షాజహాన్ ఇప్పటికే టీవీకే కేబినెట్‌లో మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మారుతున్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐయూఎంఎల్ జాతీయ అధ్యక్షుడు ఖాదర్ మొహిదీన్ తెలిపారు.

మరింత IUML: డీఎంకేకు 60 ఏళ్ల మిత్రపక్షం ‘ఐయూఎంఎల్’ గుడ్ బై.. విజయ్ ‘టీవీకే’ గూటికి ముస్లిం లీగ్!
Delhi High Court

Delhi High Court:టెలిగ్రామ్‌పై నిషేధాన్ని సమర్థించిన ఢిల్లీ హైకోర్టు

Delhi High Court: టెలిగ్రామ్‌పై కేంద్ర ప్రభుత్వం విధించిన తాత్కాలిక నిషేధాన్ని ఢిల్లీ హైకోర్టు సమర్థిస్తూ ఆ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. జూన్ 21న జరగనున్న నీట్ రీ-ఎగ్జామ్ పేపర్ లీక్ కాకుండా ముందస్తు జాగ్రత్తగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఐటీ చట్టం సెక్షన్ 69A కింద ప్లాట్‌ఫారమ్‌లను నిషేధించే అధికారం ప్రభుత్వానికి ఉందని జస్టిస్ తేజస్ కారియా స్పష్టం చేశారు. ఉగ్రవాదం, సైబర్ నేరాలకు టెలిగ్రామ్ డార్క్ వెబ్‌లా మారుతోందన్న కేంద్రం వాదనతో కోర్టు ఏకీభవించింది.

మరింత Delhi High Court:టెలిగ్రామ్‌పై నిషేధాన్ని సమర్థించిన ఢిల్లీ హైకోర్టు
Telegram

Telegram: టెలిగ్రామ్ ఒక ‘కొత్త డార్క్ వెబ్’.. దేశ భద్రతకు పెను ముప్పు..!

Telegram: టెలిగ్రామ్ యాప్ ఒక “కొత్త డార్క్ వెబ్” గా మారిందని, నేరస్థులు, ఉగ్రవాదులు చట్టాల నుండి తప్పించుకోవడానికి దీనిని వాడుతున్నారని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. ఒకే అకౌంట్‌తో 40 బోట్లను సృష్టించే వీలుండటం వల్ల సైబర్ మోసాలు, ఆధార్ వంటి పౌరుల వ్యక్తిగత డేటా లీక్‌లు, పైరసీ, డ్రగ్స్ స్మగ్లింగ్ వేగంగా విస్తరిస్తున్నాయని ఐ4సి నివేదికలను ఉటంకిస్తూ కేంద్రం తన నిషేధ నిర్ణయాన్ని సమర్థించుకుంది.

మరింత Telegram: టెలిగ్రామ్ ఒక ‘కొత్త డార్క్ వెబ్’.. దేశ భద్రతకు పెను ముప్పు..!
Mumbai

Mumbai లో నీటి ముప్పు.. ఎండిపోతున్న సరస్సులు.. మరో 40 రోజులకు మాత్రమే సరిపోయే నీరు!

Mumbai: ముంబైలో ఈ ఏడాది వర్షాకాలం ఆలస్యమవడంతో నీటి ముప్పు పొంచి ఉంది. నగరానికి తాగునీరు అందించే ఏడు సరస్సులలో కేవలం 10.72 శాతం నీరు మాత్రమే ఉంది. ఈ నీటి నిల్వలు మరో 40 రోజులకు మాత్రమే సరిపోతాయని అధికారులు చెప్తున్నారు. జూన్ 20 తర్వాత వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

మరింత Mumbai లో నీటి ముప్పు.. ఎండిపోతున్న సరస్సులు.. మరో 40 రోజులకు మాత్రమే సరిపోయే నీరు!
CM Vijay

CM Vijay: సీఎం విజయ్ దసరా కానుక.. 14 లక్షల మంది రైతులకు బంపర్ బెనిఫిట్!

CM Vijay: తమిళనాడు సీఎం విజయ్ సహకార బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీ నిబంధనలు సవరిస్తూ గుడ్ న్యూస్ చెప్పారు. రూ.75,000 వరకు అప్పు ఉన్న సన్న, చిన్న, పెద్ద రైతులకు పూర్తి రుణమాఫీ చేయనుండగా.. అంతకంటే ఎక్కువ ఉన్న వారికి రూ.35,000 చొప్పున మాఫీ చేయనున్నారు. రైతుల నిరసనలతో సచివాలయంలో జరిగిన సమీక్షలో ఈ మార్పులు చేశారు. దీనివల్ల 14.43 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుండగా, ప్రభుత్వంపై రూ.5,932 కోట్ల అదనపు భారం పడనుంది.

మరింత CM Vijay: సీఎం విజయ్ దసరా కానుక.. 14 లక్షల మంది రైతులకు బంపర్ బెనిఫిట్!
NEET Re-Exam

NEET Re-Exam: దేశవ్యాప్తంగా టెలిగ్రామ్ బ్యాన్.. నీట్ ఎక్సమ్ టైమింగ్ పెంపు

NEET Re-Exam: ఈ నెల 21న జరిగే నీట్ రీ-ఎగ్జామ్ భద్రతలో భాగంగా కేంద్ర ప్రభుత్వం జూన్ 22 వరకు దేశంలో టెలిగ్రామ్ యాప్‌ను తాత్కాలికంగా నిషేధించింది. అలాగే జూన్ 30 వరకు టెలిగ్రామ్ ఎడిట్ ఆప్షన్‌ను కూడా తొలగించింది. మరోవైపు ఎన్టీఏ పరీక్ష సమయాన్ని 180 నిమిషాల నుండి 195 నిమిషాలకు పెంచింది. పేపర్ లీక్ అవ్వకుండా ఉండేందుకు దేశంలోనే తొలిసారిగా ప్రశ్నాపత్రాల తరలింపునకు విమానాలను ఉపయోగించారు.

మరింత NEET Re-Exam: దేశవ్యాప్తంగా టెలిగ్రామ్ బ్యాన్.. నీట్ ఎక్సమ్ టైమింగ్ పెంపు
Abhijit Deepak

Abhijit Deepak: ‘కాక్రోచ్ జనతా పార్టీ’ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేపై దాడి..!

Abhijit Deepak: జైపూర్‌లో నీట్ లీకేజీకి వ్యతిరేకంగా సీజేపీ నిర్వహించిన నిరసన ర్యాలీలో పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేపై గుర్తుతెలియని వ్యక్తులు చెంపదెబ్బ కొట్టి దాడి చేశారు. ఆగ్రహించిన కార్యకర్తలు దాడి చేసిన వారిని పట్టుకుని చితకబాదారు. సుప్రీంకోర్టు జడ్జి యువతను బొద్దింకలతో పోల్చిన వ్యాఖ్యల బ్యాక్‌డ్రాప్‌లో పుట్టిన ఈ పార్టీ.. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోసం దేశవ్యాప్త ఆందోళనలు చేస్తోంది.

మరింత Abhijit Deepak: ‘కాక్రోచ్ జనతా పార్టీ’ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేపై దాడి..!
Bhopal:

Bhopal: పాకిస్తాన్‌తో సంబంధాలున్న యువకుడి అరెస్ట్.. ఉగ్రవాద కంటెంట్ ప్రచారం!

Bhopal: మధ్యప్రదేశ్ ఏటీఎస్ భోపాల్‌లో మహమ్మద్ ఫరాజ్ అనే యువకుడిని ఉపా (UAPA) చట్టం కింద అరెస్ట్ చేసింది. అతని మొబైల్ నుండి పాకిస్తాన్ పంపిన ఉగ్రవాద డిజిటల్ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లో శిక్షణకు సిద్ధమవుతున్న ఈ నిందితుడు మార్షల్ ఆర్ట్స్‌లో ట్రైనింగ్ తీసుకున్నాడని, అతని విదేశీ కనెక్షన్లపై ఏటీఎస్ అధికారులు ముమ్మర విచారణ జరుపుతున్నారని సమాచారం.

మరింత Bhopal: పాకిస్తాన్‌తో సంబంధాలున్న యువకుడి అరెస్ట్.. ఉగ్రవాద కంటెంట్ ప్రచారం!
IRCTC New Website

IRCTC తత్కాల్ బుకింగ్‌కు కొత్త వెబ్‌సైట్.. జూలై 15 లోపు ప్రయాణికులు ఈ 3 పనులు చేయడం మర్చిపోవద్దు!

IRCTC New Website: ఐఆర్‌సీటీసీ తత్కాల్ సాంకేతిక సమస్యలపై జైపూర్ విద్యార్థుల ఫిర్యాదుతో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందిస్తూ జూలై 15 నాటికి కొత్త వెబ్‌సైట్ తేవాలని ఆదేశించారు. కొత్త సైట్ వచ్చే లోపు ప్రయాణికులు తమ ఐడీ, పాస్‌వర్డ్‌లను భద్రపరుచుకోవాలని, జూలై 15 పరిసరాల్లో జర్నీలు ఉంటే ముందే టికెట్లు బుక్ చేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

మరింత IRCTC తత్కాల్ బుకింగ్‌కు కొత్త వెబ్‌సైట్.. జూలై 15 లోపు ప్రయాణికులు ఈ 3 పనులు చేయడం మర్చిపోవద్దు!