Vantara

Vantara: జంతు చట్టాల ఉల్లంఘన.. ‘సిట్‌’ విచారణకు అంబానీ వంతారా

Vantara: గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో అనంత్ అంబానీ ఆధ్వర్యంలో నడుస్తున్న గ్రీన్ జూలాజికల్ రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్ – వంతారాపై వస్తున్న ఆరోపణలను స్వతంత్రంగా పరిశీలించేందుకు సుప్రీంకోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)ని ఏర్పాటు చేసింది.

ఈ బృందానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జె. చలమేశ్వర్ నేతృత్వం వహించనున్నారు. జస్టిస్ (రిటైర్డ్) రాఘవేంద్ర చౌహాన్, ముంబై మాజీ పోలీస్ కమిషనర్ హేమంత్ నగ్రాలే, మాజీ ఐఆర్‌ఎస్ అధికారి అనిష్ గుప్తా సభ్యులుగా నియమితులయ్యారు.

ఎన్జీఓలు, వన్యప్రాణుల సంస్థలు, మీడియా నివేదికలు, సోషల్ మీడియాలో వచ్చిన పలు ఫిర్యాదుల ఆధారంగా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు (PILs) దాఖలయ్యాయి. ఈ పిటిషన్లలో అక్రమ జంతు సేకరణ, ముఖ్యంగా ఏనుగుల దిగుమతి–ఎగుమతి, వన్యప్రాణుల చట్టం ఉల్లంఘనలు, జంతువుల పట్ల దుర్వినియోగం, ఆర్థిక దుష్ప్రవర్తన, మనీలాండరింగ్ లాంటి ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇవి కేవలం ఆరోపణలే తప్ప, గట్టి ఆధారాలు లేవని కోర్టు స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి: Trump: ట్రంప్‌ వార్నింగ్: నేను ఆ కార్డ్స్‌ ఆడితే.. చైనాకు వినాశనమే

ఈ నేపథ్యంలో SIT బాధ్యతలు స్పష్టంగా పేర్కొన్నాయి. వన్యప్రాణుల (రక్షణ) చట్టం, 1972 అమలు, అంతర్జాతీయ ఒప్పందం CITES అనుసరణ, జంతు సంక్షేమం, వెటర్నరీ సదుపాయాలు, పారిశ్రామిక జోన్ సమీపంలో కేంద్రం వల్ల వచ్చే పర్యావరణ సమస్యలపై పరిశీలన చేస్తారు. అదనంగా, ఆర్థిక అంశాలు, ముఖ్యంగా మనీలాండరింగ్ ఆరోపణలు కూడా SIT విచారణ పరిధిలో ఉన్నాయి.

సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం, SIT తన విచారణ నివేదికను సెప్టెంబర్ 12, 2025లోపు సమర్పించాలి. వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోవడానికే ఈ సమీక్ష అని, ఆధారం లేని ఆరోపణలు సాధారణంగా కొట్టివేయబడతాయని, కానీ న్యాయం కోసం పారదర్శక సమీక్ష అవసరమని ధర్మాసనం పేర్కొంది.

నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ నిర్ణయం వన్యప్రాణుల సంరక్షణలో పారదర్శకత, జవాబుదారీతనంను బలపరచడమే కాకుండా, జంతు సంక్షేమంపై ప్రజల్లో ఉన్న ఆందోళనలకు సమాధానం ఇవ్వడంలో కీలకంగా మారనుంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *