Posani krishna murali: ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళికి నరసారావుపేట జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ. 10 వేల చొప్పున ఇద్దరు వ్యక్తుల పూచీకత్తుపై ఆయనకు బెయిల్ ఇచ్చింది. దర్యాప్తులో భాగంగా పోసాని కృష్ణమురళిని ఈరోజు నరసారావుపేట కోర్టులో హాజరుపరిచారు.
గతేడాది నవంబర్లో నరసారావుపేట పోలీస్ స్టేషన్లో పోసాని కృష్ణమురళిపై కేసు నమోదైంది. తెలుగుదేశం పార్టీ నాయకుడు కొట్టా కిరణ్ ఫిర్యాదు చేయడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్పై పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

